Political News

చంద్ర‌బాబు… త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డు: నారా లోకేష్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రికీ త‌ల‌వంచ‌బోర‌ని, త‌ల దించ‌బోర‌ని ఆ పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీలో సంక్షోభం కొత్త‌కాద‌న్నారు. తాజాగా ఆయ‌న పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. “నా క‌ల‌లో కూడా ఇటువంటి ప‌రిస్థితి వ‌స్తుంది అని ఊహించ‌లేదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ముందుండి పోరాడేవారు. అయితే, నాటి పోరాటం వేరు, నేడు మ‌నం చేసే పోరాటం వేరు. ఇప్ప‌డు సైకో జ‌గ‌న్ అనే రాక్ష‌సుడితో పోరాడుతున్నాం” అని లోకేష్ అన్నారు.

త‌న కుటుంబాన్ని వ‌దిలి ప్ర‌జ‌ల కోస‌మే 45 ఏళ్లు ప‌నిచేసిన నిస్వార్థ సేవ‌కుడు చంద్ర‌బాబుని వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ 43 రోజులు జైల్లో నిర్బంధించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ని ములాఖ‌త్‌ల‌లో క‌లిసిన‌ప్పుడు ఆయన నీతి- నిజాయితీతో కూడిన‌ ధైర్యం క‌నిపించింద‌ని తెలిపారు. శాంతియుతంగా పోరాడండి, అరాచ‌క‌పాల‌న‌ని అంత‌మొందించేందుకు ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయండి అని పిలుపునిచ్చిన‌ట్టు చెప్పారు. సైకో జ‌గ‌న్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌టానికి చంద్ర‌బాబు- ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి పోరాడాల‌ని నిశ్చ‌యించుకున్నారని నారా లోకేష్ చెప్పారు.

టిడిపి-జ‌న‌సేన కూట‌మికి 160 సీట్లు
టీడీపీ-జ‌న‌సేన కూట‌మి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని నారా లోకేష్ చెప్పారు. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌లకి భ‌రోసా ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి రాష్ట్ర‌మంతా ప్రారంభం కానుందతెలిపారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుపై ఆవేద‌న‌తో అశువులు బాసిన అభిమానుల కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి అండ‌గా నిలిచేందుకు నారా భువ‌నేశ్వ‌రి త్వరలోనే “నిజం గెలవాలి” అనే కార్య‌క్ర‌మం ద్వారా మృతుల కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శిస్తారని వివ‌రించారు.

బాబు రాగానే యువ‌గ‌ళం
చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర పునః ప్రారంభం అవుతుంద‌ని నారా లోకేష్ చెప్పారు. ఎక్క‌డ యాత్ర‌ను ఆపామో అక్క‌డి నుంచి పాద‌యాత్ర ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. యాత్ర‌కు వ‌చ్చిన జోష్‌తో వైసీపీ నేత‌లు అనేక కుట్ర‌లు ప‌న్నార‌ని, అయినా వాటిని ఛేదించుకుని ముందుకుసాగామ‌ని నారా లోకేష్ వివ‌రించారు.

This post was last modified on October 21, 2023 8:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

2 hours ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

3 hours ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

4 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

5 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

6 hours ago

ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసుకోవడం అవసరమా

ఇవాళ అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీకి రాకా టైటిల్ అనౌన్స్ చేసి ప్రీ లుక్  పోస్టర్ వదిలిన…

6 hours ago