Political News

రెడ్ల‌కు గేలం.. కేసీఆర్ వ్యూహం అద‌ర‌హో!

ఎన్నిక‌లు ఎన్నిక‌లే. రాజ‌కీయాలు రాజ‌కీయాలే! ఏ ఒక్క విష‌యాన్నీ వ‌దులుకునేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ సిద్ధంగా లేదు. అందుకే.. అందిన ప్ర‌తి విష‌యాన్నీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ఆయ‌న ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

రెడ్డి ట్యాగ్ ఉన్న‌వారు ఎవ‌రు వ‌చ్చినా.. వారి వెనుక ఏముంది? ప్ర‌జ‌ల‌ను క‌దిలించ‌గ‌ల‌రా? ఓట్లు వేయించ‌గలరా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టేసి.. వారు వ‌స్తే చాలు కండువా క‌ప్పేయ‌డ‌మే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. త‌న సామాజిక వ‌ర్గాన్ని అనున‌యిస్తున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అంటేనే రెడ్ల‌కు కంచుకోట అనే టాక్ ఉంది. గ‌త 2018 ఎన్నిక‌ల్లో కూడా రెడ్డి వ‌ర్గం కాంగ్రెస్ వైపునే ఉన్నా.. అప్ప‌ట్లో పొత్తులు విక‌టించి.. రెడ్డి వ‌ర్గం దూర‌మైంది.

ఇది కేసీఆర్‌కు ప‌రోక్షంగా మేలు చేసిందనే టాక్ ఉంది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ దాదాపు ఒంట‌రిగానే ముందుకు సాగుతోంది. ఒక‌టి రెండు జిల్లాల్లో మాత్రమే క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లుపుతోంది. వెర‌సి మొత్తంగా రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను క‌ద‌ల‌బార‌కుండా.. కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. దీనిని గ‌మ‌నించిన కేసీఆర్ అదే ఓటు బ్యాంకును త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌గా ప్ర‌జ‌ల్లో లేని నాయ‌కుల‌ను కూడా ఆయ‌న పిలిచి మ‌రీ కండువాలు క‌ప్పుతున్నారు.

వీరిలో మాజీ ఎమ్మెల్యే జిట్టా బాల‌కృష్నారెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటివారు ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్ర‌జ‌ల్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు. అయినా కూడా రెడ్డి ట్యాగ్ ఉండ‌డంతో ఆ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు వీరిని తురుపు ముక్క‌ల్లా వాడుకునే వ్యూహంతోనే కేసీఆర్ వీరికి ఎన్నిక‌ల ముంగిట కండువాలు క‌ప్పేశారు. వీరికిటికెట్లు ఇవ్వ‌రు. రేపు మ‌రోసారి ప్ర‌భుత్వం వ‌స్తే.. నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కుతాయి. కానీ, ఈలోపు మాత్రం వీరు రెడ్డి వ‌ర్గాన్ని ఆక‌ర్షించాలి. కేసీఆర్ కు అనుకూలంగా, రేవంత్‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పాలి. ఇదీ టాస్క్‌. మొత్తానికి గ‌తానికి భిన్నంగా రెడ్డివ‌ర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

This post was last modified on October 21, 2023 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago