మేం తెలంగాణ ఇచ్చామని ఒక పార్టీ. కాదు కాదు… అహర్నిశలూ కొట్లాడి తెలంగాణ తెచ్చామని మరోపార్టీ.. అసలు మేమే లేకపోతే.. తెలంగాణ వచ్చేదా? అని ఇంకో పార్టీ! వెరసి రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా.. తెలంగాణ ఏర్పాటు విషయం తాజా ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగానే మారిపోయింది. ఆయా పార్టీలకు సెంటిమెంటు అస్త్రంగానే ఉపయోగపడుతోంది. పల్లె నుంచి సిటీ గల్లీ వరకు…సెంటిమెంటును పండించేందుకు ఆయా పార్టీల మాటకారులంతా.. పోగవుతున్నారు.
సరే.. ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది కాబట్టి.. దేనిష్టం దానిది. అయితే, అసలు ప్రజల నాడి ఎలా ఉంది? ఇంకా సెంటిమెంటు కుంపట్లలోనే వారు పొద్దు పొడుచుకుంటున్నారా? ఇంకా నాటి సంగతులే తలుచుకుని.. పార్టీలకు అండగా ఉంటున్నారా? అసలు ప్రజల దృష్టిలో సెంటిమెంటు పండుతోందా? అనేది కీలక చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఆన్లైన్ చానెళ్లు కొన్ని సర్వేలు చేశాయి. నేరుగా గ్రామాల్లోని రచ్చబండలకెల్లెల్లి.. మైకు గొట్టాలు పెట్టినయి!
సెంటిమెంటుపై ప్రశ్నలు కూడా కురిపించినయి. అయితే, గ్రామీణ జనాభాలో దాదాపు ఎక్కడా ఇంకా సెంటిమెంటు కోసం కొట్టుకుంటున్న పరిస్తితి లేదు. “అది.. గైపోయిన ముచ్చట బిడ్డా! ఈ పదేళ్లలో నువ్వేం చేసినవో చెప్పు!!” అని ఒకరిద్దరు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. వారి అంతరంగం.. ఆత్మావలోక నం ఎలా ఉన్నా.. సెంటిమెంటు కోసం పాకులాడుతున్న పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. అంటే.. సెంటిమెంటు పండడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.
అయితే.. అక్కడక్కడా.. తెలంగాణ రాక విషయంలో కేసీఆర్కు ఎంత వెయిటేజీ ఇస్తున్నారో.. అంతే సమానంగా కాంగ్రెస్కు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరహా పరిస్థితి గత ఎన్నికల సమయంలో లేకపోవడం గమనార్హం. ఇక, పట్టణ ఓటరు విషయానికి వస్తే.. సెంటిమెంటును ఎక్కడా పట్టించుకోవడం లేదు. కరడు గట్టిన తెలంగాణ యువత కూడా.. సెంటిమెంటు క్లోజ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం.. అభివృద్ధి అనే అంశాలనే యువత ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ అయినా.. ఇతర పార్టీలైనా సెంటిమెంటు విషయంలో దూకుడు ప్రదర్శించడం సరికాదనేది తేలిపోయింది.
This post was last modified on October 21, 2023 11:59 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…