Political News

డిసెంబ‌రు 3న తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ: రాహుల్ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర తొలి విడ‌త కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ యాత్ర‌లో కాంగ్రెస్ అగ్ర నేత‌లు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఇక‌, బ‌స్సు యాత్ర ముగింపు సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్(ఎక్స్)లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ సృష్టించ‌నుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ విష‌యం చెబుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు “దొర‌ల తెలంగాణ‌కు-ప్ర‌జ‌ల తెలంగాణ‌కు” మధ్య జ‌రుగుతున్నాయ‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. దొర‌ల పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెర‌వేర్చ‌లేద‌ని.. రాహుల్ విమ‌ర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చార‌ని..ఇప్ప‌టికీ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌జ‌లు త‌మ‌వైపు చూస్తున్నార‌ని, ఎన్నిక‌లు ఎప్పుడొస్తాయా? అని తెలంగాణ స‌మాజం ఎదురు చూసింద‌ని తెలిపారు.

డిసెంబ‌రు 3న వెల్ల‌డ‌య్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతోంద‌ని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాది గ్యారెంటీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మ‌రి ఆయ‌న చెప్పిన‌ట్టే జ‌రుగుతుందేమో చూడాలి. మొత్తానికి రాహుల్ వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు, శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంది.

This post was last modified on October 20, 2023 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

11 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago