Political News

డిసెంబ‌రు 3న తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ: రాహుల్ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర తొలి విడ‌త కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ యాత్ర‌లో కాంగ్రెస్ అగ్ర నేత‌లు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఇక‌, బ‌స్సు యాత్ర ముగింపు సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్(ఎక్స్)లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ సృష్టించ‌నుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ విష‌యం చెబుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు “దొర‌ల తెలంగాణ‌కు-ప్ర‌జ‌ల తెలంగాణ‌కు” మధ్య జ‌రుగుతున్నాయ‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. దొర‌ల పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెర‌వేర్చ‌లేద‌ని.. రాహుల్ విమ‌ర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చార‌ని..ఇప్ప‌టికీ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌జ‌లు త‌మ‌వైపు చూస్తున్నార‌ని, ఎన్నిక‌లు ఎప్పుడొస్తాయా? అని తెలంగాణ స‌మాజం ఎదురు చూసింద‌ని తెలిపారు.

డిసెంబ‌రు 3న వెల్ల‌డ‌య్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతోంద‌ని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాది గ్యారెంటీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మ‌రి ఆయ‌న చెప్పిన‌ట్టే జ‌రుగుతుందేమో చూడాలి. మొత్తానికి రాహుల్ వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు, శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంది.

This post was last modified on October 20, 2023 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago