టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందని ఆశించిన చంద్రబాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నిరాశ తప్పలేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు నవంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీం కోర్టుకు దసరా సెలవులు. ఈ కేసులో ఇరు పక్షాలు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయటానికి అక్టోబర్ 20 చివరి రోజు. దీంతో, ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రోజు తీర్పు కచ్చితంగా వస్తుందని అంతా అనుకున్నారు.
మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులకు రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్ లు ఇవ్వనున్నారు. అంతకుముందు, ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఈ పిటిషన్ పై ఇప్పుడు విచారణ అవసరం లేదని మధ్యాహ్నం న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రోజుకు ఒకసారి మాత్రమే న్యాయవాదులకు ములాఖత్ అవకాశం ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ములాఖత్ ల సంఖ్య మూడుకు పెంచాలని చంద్రబాబు తరపు లాయర్లు మరోసారి పిటిషన్ వేశారు. దీంతో, రోజుకు రెండు లీగల్ ములాఖత్ లకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని, ప్రతి ములాఖాత్ కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు ఉండేలా అనుమతించాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…