Political News

టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌లే కోరుతున్నారు: ప‌వ‌న్

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం.. త‌న‌ది కాద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను అనుస‌రించి తీసుకున్న నిర్ణ‌యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏర్ప‌డిన స్తబ్ద‌త‌, కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మంత‌నాల నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మంగ‌ళ‌గిరిలో త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పొత్తుల విష‌యాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించారు. టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే నిర్ణ‌యం త‌న‌దికాద‌ని.. ప్ర‌జ‌లే కోరుకుంటున్నార‌ని ఇప్పుడు ఏపీకి ఆ అవ‌స‌రం ఉంద‌ని పవ‌న్ వ్యాఖ్యానించారు. పార్టీకి ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది క్రియాశీల స‌భ్యులు ఉన్నార‌న్న ఆయ‌న.. ప్ర‌జ‌ల భ‌విత‌ను బంగారు మ‌యం చేసే బాధ్య‌త త‌న‌తోపాటు వీరంద‌రిపైనా ఉంద‌ని చెప్పారు. టీడీపీ-జ‌న‌సేన పొత్తుల విష‌యాన్ని తాను అనేక కోణాల్లో ప‌రిశీల‌న చేశాన‌ని ప‌వ‌న్ చెప్పారు. అనేక స‌ర్వేలు తెప్పించుకున్నాకే పొత్తుల విష‌యాన్ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు.

ఎవ‌రు ఎన్ని చెప్పినా.. ఎవ‌రు వ‌చ్చినా రాకున్నా.. టీడీపీతోనే త‌న ప్ర‌యాణం ఉంటుంద‌ని ప‌వ‌న్ తెల్చి చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఈ ప్ర‌యాణంలో స‌హ‌జ‌మేన‌ని, అయినా వాటిని దాటుకుని ముందుకు సాగుతామ‌ని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పోవాల‌నే ఏకేక నినాదంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ప‌ద‌వులు.. పీఠాలు.. త‌ర్వాత ఆలో చిస్తామ‌ని చెప్పారు.

సీఎం సీటుపై..
ముఖ్య‌మంత్రి ప‌ద‌విపైనా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి పీఠం ఇస్తామంటే నేనువ‌ద్దంటానా? అని అన్నారు. అయితే.. దాని కోసం ఎవ‌రితోనూ గొడ‌వ పెట్టుకోన‌ని.. దాని కోస‌మే తాను వెంపర్లాడ‌డ‌ని తేల్చి చెప్పారు. సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటామ‌ని, అయితే.. ముందుగా రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం పోవాల‌నే సంక‌ల్పంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం .. జనసేన క్రియాశీల సభ్యులకు ప‌లు బాధ్య‌త‌లు, ప‌ద‌వులు అప్పగిస్తూ నియామక పత్రాలను పవన్ అందించారు.

This post was last modified on October 20, 2023 8:21 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago