Political News

టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌లే కోరుతున్నారు: ప‌వ‌న్

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం.. త‌న‌ది కాద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను అనుస‌రించి తీసుకున్న నిర్ణ‌యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏర్ప‌డిన స్తబ్ద‌త‌, కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మంత‌నాల నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మంగ‌ళ‌గిరిలో త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పొత్తుల విష‌యాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించారు. టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే నిర్ణ‌యం త‌న‌దికాద‌ని.. ప్ర‌జ‌లే కోరుకుంటున్నార‌ని ఇప్పుడు ఏపీకి ఆ అవ‌స‌రం ఉంద‌ని పవ‌న్ వ్యాఖ్యానించారు. పార్టీకి ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది క్రియాశీల స‌భ్యులు ఉన్నార‌న్న ఆయ‌న.. ప్ర‌జ‌ల భ‌విత‌ను బంగారు మ‌యం చేసే బాధ్య‌త త‌న‌తోపాటు వీరంద‌రిపైనా ఉంద‌ని చెప్పారు. టీడీపీ-జ‌న‌సేన పొత్తుల విష‌యాన్ని తాను అనేక కోణాల్లో ప‌రిశీల‌న చేశాన‌ని ప‌వ‌న్ చెప్పారు. అనేక స‌ర్వేలు తెప్పించుకున్నాకే పొత్తుల విష‌యాన్ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు.

ఎవ‌రు ఎన్ని చెప్పినా.. ఎవ‌రు వ‌చ్చినా రాకున్నా.. టీడీపీతోనే త‌న ప్ర‌యాణం ఉంటుంద‌ని ప‌వ‌న్ తెల్చి చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఈ ప్ర‌యాణంలో స‌హ‌జ‌మేన‌ని, అయినా వాటిని దాటుకుని ముందుకు సాగుతామ‌ని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పోవాల‌నే ఏకేక నినాదంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ప‌ద‌వులు.. పీఠాలు.. త‌ర్వాత ఆలో చిస్తామ‌ని చెప్పారు.

సీఎం సీటుపై..
ముఖ్య‌మంత్రి ప‌ద‌విపైనా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి పీఠం ఇస్తామంటే నేనువ‌ద్దంటానా? అని అన్నారు. అయితే.. దాని కోసం ఎవ‌రితోనూ గొడ‌వ పెట్టుకోన‌ని.. దాని కోస‌మే తాను వెంపర్లాడ‌డ‌ని తేల్చి చెప్పారు. సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటామ‌ని, అయితే.. ముందుగా రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం పోవాల‌నే సంక‌ల్పంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం .. జనసేన క్రియాశీల సభ్యులకు ప‌లు బాధ్య‌త‌లు, ప‌ద‌వులు అప్పగిస్తూ నియామక పత్రాలను పవన్ అందించారు.

This post was last modified on October 20, 2023 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

53 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago