ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 8వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పీటీ వారెంట్ పై నవంబర్ 9వ తేదీ వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇక, నవంబర్ 9వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
అయితే, చంద్రబాబును విచారణ జరిపేందుకు అనుమతినివ్వాలని సిఐడి తరఫు లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదని చంద్రబాబు తరఫు సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెక్షన్ 17ఏ ఫైబర్ నెట్ లో కూడా వర్తిస్తుందని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని ఉత్కంఠ ఏర్పడింది.
దీంతోపాటు, చంద్రబాబు సంబంధించిన పలు పిటిషన్లు ఈ రోజు విచారణకు రానున్నాయి. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో తీర్పు రానుంది. ఇక, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును పిటి వారెంట్పై, చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదన్న పిటిషన్ లతోపాటు జైలులో చంద్రబాబుతో లీగల్ ములాఖత్ ల తగ్గింపును సవాల్ చేసిన పిటిషన్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతోంది.
This post was last modified on October 20, 2023 1:43 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…