Political News

తెలంగాణ రాకుంటే కేసీఆర్ బిచ్చమెత్తుకునేటోడు: రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో, బిర్లా మందిర్ వద్దో బిచ్చమెత్తుకునేటోళ్లు అని రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ రాకపోతే అమెరికాలో కేటీఆర్ బాత్రూమ్ లు కడుక్కునేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో ఆశలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ నట్టేట ముంచారని, అయినా సరే మూడో సారి సీఎం అయి ప్రజలను దోచుకోవాలని కలలు కంటున్నారని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎవరని అడుగుతున్న కేటీఆర్ ఒక సన్నాసి అని, ఈ దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు తెలుసుకోవాలని హితవు పలికారు. గాంధీ కుటుంబానికి ఇళ్లు లేవని, పదేళ్లలో ఫామ్ హౌస్ లు కట్టుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని విమర్శలు గుప్పించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మోసం చేసి నట్టేట ముంచారని, 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదాపడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే అభాండాలు వేస్తున్నారని ప్రవళిక ఆత్మహత్య గురించి ప్రస్తావించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అడుగుతున్నారని, శంషాబాద్ ఎయిర్ పోర్టు మొదలు ఔటర్ రింగు రోడ్డు ఇచ్చారో సన్నాసోడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on October 19, 2023 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

5 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago