టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తాజా మూవీ భగవంత్ కేసరికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాలకు, చంద్రబాబుకు లికెందుకు మంత్రివర్యా?! అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, బాబు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నిరసనలను కార్నర్ చేస్తూ.. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధలో ఉన్నామని పదే పదే చెబుతున్న నందమూరి బాలకృష్ణ.. తన తాజా సినిమా భగవంత్ కేసరిని ఎందుకు వాయిదా వేసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే.. ఆయనకు ఆదాయం కావాలి.. సాధారణ కార్యకర్తలకు మాత్రం రోజు వారీ పనులు మానుకుని మరీ.. నిరసనలు తెలపాలా? అని ప్రశ్నించారు.
ఇక, హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించడంపైనా మంత్రి అక్కసు వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. “రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లు ఎందుకు? ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకే” అని మంత్రి కారుమూరి అన్నారు.
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…