టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తాజా మూవీ భగవంత్ కేసరికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాలకు, చంద్రబాబుకు లికెందుకు మంత్రివర్యా?! అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, బాబు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నిరసనలను కార్నర్ చేస్తూ.. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధలో ఉన్నామని పదే పదే చెబుతున్న నందమూరి బాలకృష్ణ.. తన తాజా సినిమా భగవంత్ కేసరిని ఎందుకు వాయిదా వేసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే.. ఆయనకు ఆదాయం కావాలి.. సాధారణ కార్యకర్తలకు మాత్రం రోజు వారీ పనులు మానుకుని మరీ.. నిరసనలు తెలపాలా? అని ప్రశ్నించారు.
ఇక, హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించడంపైనా మంత్రి అక్కసు వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. “రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లు ఎందుకు? ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకే” అని మంత్రి కారుమూరి అన్నారు.
This post was last modified on October 19, 2023 8:04 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…