టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తాజా మూవీ భగవంత్ కేసరికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాలకు, చంద్రబాబుకు లికెందుకు మంత్రివర్యా?! అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, బాబు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నిరసనలను కార్నర్ చేస్తూ.. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధలో ఉన్నామని పదే పదే చెబుతున్న నందమూరి బాలకృష్ణ.. తన తాజా సినిమా భగవంత్ కేసరిని ఎందుకు వాయిదా వేసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే.. ఆయనకు ఆదాయం కావాలి.. సాధారణ కార్యకర్తలకు మాత్రం రోజు వారీ పనులు మానుకుని మరీ.. నిరసనలు తెలపాలా? అని ప్రశ్నించారు.
ఇక, హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించడంపైనా మంత్రి అక్కసు వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. “రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లు ఎందుకు? ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకే” అని మంత్రి కారుమూరి అన్నారు.
This post was last modified on October 19, 2023 8:04 pm
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…