టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తాజా మూవీ భగవంత్ కేసరికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాలకు, చంద్రబాబుకు లికెందుకు మంత్రివర్యా?! అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, బాబు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నిరసనలను కార్నర్ చేస్తూ.. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధలో ఉన్నామని పదే పదే చెబుతున్న నందమూరి బాలకృష్ణ.. తన తాజా సినిమా భగవంత్ కేసరిని ఎందుకు వాయిదా వేసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే.. ఆయనకు ఆదాయం కావాలి.. సాధారణ కార్యకర్తలకు మాత్రం రోజు వారీ పనులు మానుకుని మరీ.. నిరసనలు తెలపాలా? అని ప్రశ్నించారు.
ఇక, హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించడంపైనా మంత్రి అక్కసు వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. “రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లు ఎందుకు? ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకే” అని మంత్రి కారుమూరి అన్నారు.
This post was last modified on October 19, 2023 8:04 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…