ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేశారంటూ.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం.. అక్కడి నుంచి కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజాగా రిమాండ్ గడువు గురువారం(అక్టోబరు 19)తో ముగిసింది. దీంతో జైలు అధికారులు కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. మరోవైపు కోర్టు కూడా వర్చువల్గా చంద్రబాబును హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో వర్చువల్గా చంద్రబాబు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును ప్రశ్నించినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
అంతేకాదు.. ఇటీవల ఏసీ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా న్యాయాధికారి ప్రస్తావించినట్టు తెలిసింది. టవర్ ఏసీ పెట్టాలని తాము ఆదేశించామని.. దానిని వినియోగంలోకి తెచ్చారా? ఇప్పుడు జైలు గది వాతావరణం ఎలా ఉందని చంద్రబాబును ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తానికి ఆయా అంశాలపై సానుకూలంగానే సమాధానం చెప్పిన చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో తాను వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిపారు.
అయితే.. జైలులో తన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న తన ఫొటోలను కొందరు తీసి మీడియాకు ఇస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. ఆయా విషయాలను పోలీసులు విచారిస్తున్నట్టు తమకు సమాచారం ఇచ్చారని న్యాయాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో రిమాండ్ను నవంబరు 1వ తేదీవరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
This post was last modified on October 19, 2023 1:46 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…