ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేశారంటూ.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం.. అక్కడి నుంచి కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజాగా రిమాండ్ గడువు గురువారం(అక్టోబరు 19)తో ముగిసింది. దీంతో జైలు అధికారులు కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. మరోవైపు కోర్టు కూడా వర్చువల్గా చంద్రబాబును హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో వర్చువల్గా చంద్రబాబు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును ప్రశ్నించినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
అంతేకాదు.. ఇటీవల ఏసీ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా న్యాయాధికారి ప్రస్తావించినట్టు తెలిసింది. టవర్ ఏసీ పెట్టాలని తాము ఆదేశించామని.. దానిని వినియోగంలోకి తెచ్చారా? ఇప్పుడు జైలు గది వాతావరణం ఎలా ఉందని చంద్రబాబును ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తానికి ఆయా అంశాలపై సానుకూలంగానే సమాధానం చెప్పిన చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో తాను వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిపారు.
అయితే.. జైలులో తన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న తన ఫొటోలను కొందరు తీసి మీడియాకు ఇస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. ఆయా విషయాలను పోలీసులు విచారిస్తున్నట్టు తమకు సమాచారం ఇచ్చారని న్యాయాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో రిమాండ్ను నవంబరు 1వ తేదీవరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
This post was last modified on October 19, 2023 1:46 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…