ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేశారంటూ.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం.. అక్కడి నుంచి కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజాగా రిమాండ్ గడువు గురువారం(అక్టోబరు 19)తో ముగిసింది. దీంతో జైలు అధికారులు కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. మరోవైపు కోర్టు కూడా వర్చువల్గా చంద్రబాబును హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో వర్చువల్గా చంద్రబాబు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును ప్రశ్నించినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
అంతేకాదు.. ఇటీవల ఏసీ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా న్యాయాధికారి ప్రస్తావించినట్టు తెలిసింది. టవర్ ఏసీ పెట్టాలని తాము ఆదేశించామని.. దానిని వినియోగంలోకి తెచ్చారా? ఇప్పుడు జైలు గది వాతావరణం ఎలా ఉందని చంద్రబాబును ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తానికి ఆయా అంశాలపై సానుకూలంగానే సమాధానం చెప్పిన చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో తాను వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిపారు.
అయితే.. జైలులో తన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న తన ఫొటోలను కొందరు తీసి మీడియాకు ఇస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. ఆయా విషయాలను పోలీసులు విచారిస్తున్నట్టు తమకు సమాచారం ఇచ్చారని న్యాయాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో రిమాండ్ను నవంబరు 1వ తేదీవరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
This post was last modified on October 19, 2023 1:46 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…