ఎల్లారెడ్డి. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం. నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. ఇది కొంత భాగం జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంది. దీంతో ఇక్కడ ఇటు నిజామాబాద్ ఎంపీ, అటు జహీరాబాద్ ఎంపీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ రాజకీయాలు కూడా చిత్రంగా ఉన్నాయి. పార్టీలు మారే నాయకులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే కావడం గమనార్హం.
బీఆర్ ఎస్ మాజీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఏకంగా ఇక్కడ నాలుగు సార్లు విజయం దక్కించుకున్నారు. గత 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున ఏనుగు రవీందర్రెడ్డి పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఏనుగు రవీందర్ను కేసీఆర్ పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్న సురేందర్కు గులాబీ బాస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
తొలి నాళ్లలో ఏనుగుకు ఎమ్మెల్సీ ఇస్తామని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. కానీ, ఇది సాకారం కాలేదు. దీంతో ఏనుగు రవీందర్ వేచి చూసి.. బీజేపీలో చేరిపోయారు. ఇక్కడ సురేందర్ గత ఎన్నికల్లో ఒక్కసారి విజయం దక్కించుకోగా.. ఏనుగు రవీందర్కు పోల్ మేనేజ్ మెంట్లో అనుభవం ఉండడం, నాలుగు సార్లు విజయం దక్కించుకున్న అనుభవం ఉండడం గమనార్హం. ప్రస్తుతం బీఆర్ ఎస్ మరోసారి సురేందర్కే టికెట్ ఇచ్చింది.
ఇక, బీజేపీ ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఏనుగు రవీందర్కు టికెట్ ఖాయమనే చర్చ సాగుతోంది. ఆయన కూడా అప్రకటితంగా.. ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలు కూడా ఎల్లారెడ్డిపై పట్టు బిగించాయి. ఈ రెండు పార్టీలు కూడా.. గతంలో ఇక్కడ గెలిచి ఉండడం, మంచి కార్యకర్తలు ఉండడంతో పార్టీల మధ్య ఈ సారి త్రిముఖ, లేదా చతుర్ముఖ(టీడీపీ బలమైన నాయకుడిని దింపితే) పోటీ తప్పదనే చర్చసాగుతోంది. అయితే.. ప్రధాన పోరు మాత్రం ఏనుగు వర్సెస్ సురేందర్ మధ్యే సాగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…