ఎల్లారెడ్డి. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం. నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. ఇది కొంత భాగం జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంది. దీంతో ఇక్కడ ఇటు నిజామాబాద్ ఎంపీ, అటు జహీరాబాద్ ఎంపీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ రాజకీయాలు కూడా చిత్రంగా ఉన్నాయి. పార్టీలు మారే నాయకులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే కావడం గమనార్హం.
బీఆర్ ఎస్ మాజీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఏకంగా ఇక్కడ నాలుగు సార్లు విజయం దక్కించుకున్నారు. గత 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున ఏనుగు రవీందర్రెడ్డి పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఏనుగు రవీందర్ను కేసీఆర్ పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్న సురేందర్కు గులాబీ బాస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
తొలి నాళ్లలో ఏనుగుకు ఎమ్మెల్సీ ఇస్తామని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. కానీ, ఇది సాకారం కాలేదు. దీంతో ఏనుగు రవీందర్ వేచి చూసి.. బీజేపీలో చేరిపోయారు. ఇక్కడ సురేందర్ గత ఎన్నికల్లో ఒక్కసారి విజయం దక్కించుకోగా.. ఏనుగు రవీందర్కు పోల్ మేనేజ్ మెంట్లో అనుభవం ఉండడం, నాలుగు సార్లు విజయం దక్కించుకున్న అనుభవం ఉండడం గమనార్హం. ప్రస్తుతం బీఆర్ ఎస్ మరోసారి సురేందర్కే టికెట్ ఇచ్చింది.
ఇక, బీజేపీ ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఏనుగు రవీందర్కు టికెట్ ఖాయమనే చర్చ సాగుతోంది. ఆయన కూడా అప్రకటితంగా.. ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలు కూడా ఎల్లారెడ్డిపై పట్టు బిగించాయి. ఈ రెండు పార్టీలు కూడా.. గతంలో ఇక్కడ గెలిచి ఉండడం, మంచి కార్యకర్తలు ఉండడంతో పార్టీల మధ్య ఈ సారి త్రిముఖ, లేదా చతుర్ముఖ(టీడీపీ బలమైన నాయకుడిని దింపితే) పోటీ తప్పదనే చర్చసాగుతోంది. అయితే.. ప్రధాన పోరు మాత్రం ఏనుగు వర్సెస్ సురేందర్ మధ్యే సాగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…