Political News

పొత్తు వద్దు.. పోటీ వద్దు.. పవన్ కు చెప్పేశారు

తెలంగాణలో పోటీకి దిగాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన ఆచరణలోకి రావడం లేదని తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణ రాజకీయాల మీద కానీ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద కానీ పవన్ మాట్లాడలేదు. కానీ ఎన్నికల వేళ బరిలోకి తమ అభ్యర్థుల్ని దింపాలన్న ఆలోచనకు రావటం.. అందుకు తగ్గట్లే ప్రకటన వెలువడటం తెలిసిందే.

జనసేన బరిలోకి నిలిస్తే అధికార బీఆర్ఎస్ కు మేలు జరగటం ఖాయమంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు.. విపక్షాలకు పడాల్సిన ఓట్లు జనసేనకు పడటం ద్వారా.. కేసీఆర్ కు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పోటీ చేయాలని భావిస్తున్న 30 స్థానాల్లో పార్టీ ఉనికి.. స్థానిక నాయకత్వం పెద్దగా లేకున్నా.. పవన్ ఛరిష్మా ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అందుకే.. జనసేన పార్టీని ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని బీజేపీ కోరింది.

గతంలోనూ గ్రేటర్ ఎన్నికల వేళలోనూ.. ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పోటీ నుంచి విరమించుకున్న పవన్.. తాజా అసెంబ్లీ ఎన్నికల వేళలో తాము బరిలోకి దిగుతామని చెప్పటం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు పవన్ తో భేటీ కావటమే కాదు.. పార్టీ సందేశాన్ని ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయొద్దని.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పొత్తు సఫలం కాదన్న విషయాన్ని పవన్ కు చెప్పేయటమేకాదు.. అధిష్ఠాన సూచనను పాటించాల్సిందిగా మరీ మరీ కోరినట్టు తెలుస్తోంది. ఈ కారణంతోనే.. పార్టీలో కన్ఫ్యూజ్ లేకుండా చేసేందుకు హడావుడిగా ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అవకాశం లేదని.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. ఏ రీతిలో అయితే పోటీకి దూరంగా ఉన్నారో.. అలాంటి సీన్ రిపీట్ కావటం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా ముందే మాట్లాడకుని ఉంటే బాగుండేదని జనసేన నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 19, 2023 9:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago