Political News

కేసీఆర్ పాల‌న దుర‌దృష్ట‌క‌రం: ప్రియాంక గాంధీ

ఎన్నో ఆకాంక్ష‌ల‌తో ఎంతో మంతి ప్రాణ త్యాగాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న దుర‌దృక‌రంగా సాగింద‌ని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ ఆనందంగా లేర‌ని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌యేన‌ని.. చెప్పారు. ఎన్నోకోరిక‌ల‌తో నీళ్లు-నియామ‌కాలు నినాదంతో ఏర్ప‌డిన రాష్ట్రంలో ఏ ఒక్క‌రికీ సామాజిక‌న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రియాంక గాంధీ చెప్పారు.

“తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది” అని ప్రియాంకగాంధీ అన్నారు. కేసీఆర్ పాల‌న కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌కుఉద్యోగాలు ఇచ్చేందుకు, వారు చేసిన అవినీతి నుంచి వారిని కాపాడుకునేందుకు మాత్ర‌మే ప‌రిమితం అయింద‌ని చెప్పుకొచ్చారు.

“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మీ ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విష‌యం మీకు తెలిసిందే. అయినా.. ఈ ప‌దేళ్ల‌లో ఇక్కడి ప్ర‌జ‌ల ఆకాంక్షలు ఏ మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి“ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ములుగు జిల్లా రామాంజపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార‌ సభలో ప్రియాంకగాంధీ ప్ర‌సంగించారు.

This post was last modified on October 18, 2023 10:34 pm

Share
Show comments
Published by
Satya
Tags: BRSKCR

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago