Political News

కేసీఆర్ పాల‌న దుర‌దృష్ట‌క‌రం: ప్రియాంక గాంధీ

ఎన్నో ఆకాంక్ష‌ల‌తో ఎంతో మంతి ప్రాణ త్యాగాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న దుర‌దృక‌రంగా సాగింద‌ని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ ఆనందంగా లేర‌ని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌యేన‌ని.. చెప్పారు. ఎన్నోకోరిక‌ల‌తో నీళ్లు-నియామ‌కాలు నినాదంతో ఏర్ప‌డిన రాష్ట్రంలో ఏ ఒక్క‌రికీ సామాజిక‌న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రియాంక గాంధీ చెప్పారు.

“తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది” అని ప్రియాంకగాంధీ అన్నారు. కేసీఆర్ పాల‌న కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌కుఉద్యోగాలు ఇచ్చేందుకు, వారు చేసిన అవినీతి నుంచి వారిని కాపాడుకునేందుకు మాత్ర‌మే ప‌రిమితం అయింద‌ని చెప్పుకొచ్చారు.

“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మీ ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విష‌యం మీకు తెలిసిందే. అయినా.. ఈ ప‌దేళ్ల‌లో ఇక్కడి ప్ర‌జ‌ల ఆకాంక్షలు ఏ మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి“ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ములుగు జిల్లా రామాంజపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార‌ సభలో ప్రియాంకగాంధీ ప్ర‌సంగించారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

2 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

2 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

2 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

5 hours ago