వచ్చే 2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని తీరాలనే కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా ఎంత? వారి ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఒక సర్వేను అధికారికంగా, మరో సర్వేను అనధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీలో కులాల వారీగా జనాభా ఎంత ఉన్నారనే అంశంపై వైసీపీ ప్రభుత్వం పక్కా లెక్కలు తీయనుంది. దీనికి సంబంధించి తాజాగా సీఎం జగన్ ఉన్నతాధికారులతో మంతనాలు సాగించారు. లెక్కలు ఎలా వేయాలి? కులాల ను ఏ విధంగా గుర్తించాలి(కొన్నింటిని) అనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. అత్యంత రహస్యంగా చేసిన ఈ మంతనాలపై వైసీపీ వర్గాల్లో గుసగుస ప్రారంభమైంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు సర్కారు నిర్ణయించినట్టు వీరు చెబుతున్నారు.
దీనిలో భాగంగా కులాల గణను అధికారికంగా చేపట్టనున్నారు. అదేసమయంలో అనధికారికంగా ఆయా కులాల ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారనే విషయాలను కూడా వైసీపీ ప్రభుత్వం సర్వే ద్వారా కూపీ లాగనుంది. నవంబరు 15 నుంచి ఈ కుల గణన ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కుల గణనలోనే రెండు మూడు ప్రశ్నల ద్వారా ఆయా కులాల కు చెందిన వారు ఏ పార్టీకి, ఏ నాయకుడికి అనుకూలమో.. ఎమ్మెల్యేపై వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోనున్నారని తెలిసింది.
ఇదే జరిగితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మరింత పుంజుకోనున్నాయి. ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా వ్యతిరేకించింది.కానీ, సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఇప్పుడు బిహార్ తర్వాత ఏపీలో కులగణన ప్రక్రియ ద్వారా.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఎన్నికల్లో ప్రజల నాడిని కూడా పసికట్టేందుకు వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తోంది.
This post was last modified on October 18, 2023 11:20 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…