వచ్చే 2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని తీరాలనే కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా ఎంత? వారి ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఒక సర్వేను అధికారికంగా, మరో సర్వేను అనధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీలో కులాల వారీగా జనాభా ఎంత ఉన్నారనే అంశంపై వైసీపీ ప్రభుత్వం పక్కా లెక్కలు తీయనుంది. దీనికి సంబంధించి తాజాగా సీఎం జగన్ ఉన్నతాధికారులతో మంతనాలు సాగించారు. లెక్కలు ఎలా వేయాలి? కులాల ను ఏ విధంగా గుర్తించాలి(కొన్నింటిని) అనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. అత్యంత రహస్యంగా చేసిన ఈ మంతనాలపై వైసీపీ వర్గాల్లో గుసగుస ప్రారంభమైంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు సర్కారు నిర్ణయించినట్టు వీరు చెబుతున్నారు.
దీనిలో భాగంగా కులాల గణను అధికారికంగా చేపట్టనున్నారు. అదేసమయంలో అనధికారికంగా ఆయా కులాల ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారనే విషయాలను కూడా వైసీపీ ప్రభుత్వం సర్వే ద్వారా కూపీ లాగనుంది. నవంబరు 15 నుంచి ఈ కుల గణన ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కుల గణనలోనే రెండు మూడు ప్రశ్నల ద్వారా ఆయా కులాల కు చెందిన వారు ఏ పార్టీకి, ఏ నాయకుడికి అనుకూలమో.. ఎమ్మెల్యేపై వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోనున్నారని తెలిసింది.
ఇదే జరిగితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మరింత పుంజుకోనున్నాయి. ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా వ్యతిరేకించింది.కానీ, సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఇప్పుడు బిహార్ తర్వాత ఏపీలో కులగణన ప్రక్రియ ద్వారా.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఎన్నికల్లో ప్రజల నాడిని కూడా పసికట్టేందుకు వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…