Political News

గుర్రం ఎగ‌రా వ‌చ్చు.. సీఎం కానూవ‌చ్చు: జానా రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “గుర్రం ఎగ‌రావొచ్చు.. నేను సీఎం కానూ వ‌చ్చు.. ఎవ‌రు మాత్రం చెప్ప‌గ‌ల‌రు” అని ఆయ‌న ఆస‌క్తిగా వ్యాఖ్యానించారు. సుమారు 50 ఏళ్ల‌కుపైగా రాజ‌కీయా ల్లో ఉన్న జానారెడ్డి తొలుత టీడీపీలో రాజ‌కీయ పాఠాలు నేర్చారు. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌ర్వాత‌..అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ బాట ప‌ట్టారు. ఈ పార్టీలోనూ అనేక కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. వైఎస్ హ‌యాంలో హోం మంత్రిగా ప‌నిచేశారు.

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కుందూరు జానా రెడ్డి ప్ర‌స్తుతం కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జ‌గింపుల క‌మిటీ కి చైర్మ‌న్‌గా ఉన్నారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆయ‌న కుమారుడికి ఇప్పించుకున్నారు. అయితే.. తాజాగా ఆయ‌న మ‌న‌సులో మాట చెప్పుకొచ్చారు. ప్రజల హృదయాల్లో తాను ముఖ్య‌మంత్రి కావాలని ఉందని జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదనను. ఏ ముఖ్య‌మంత్రి, ఏ నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు చేయనన్ని శాఖలు నేను చేశా. మంత్రిగా అనేక శాఖ‌లు చూశా. యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా. 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి. ముఖ్య‌మంత్రి కావాల‌నేది ప్ర‌జ‌ల ఇష్టం” అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఇది ఆయ‌న మ‌న‌సులో మాటేన‌ని కాంగ్రెస్ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

This post was last modified on October 18, 2023 8:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago