ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారంపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్నదానిపైనే ప్రధానంగా ఈ రోజు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఇరు వర్గాల లాయర్ల మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదని రోహత్గీ వాదించారు. అవినీతి కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించినా…మిగతా సెక్షన్స్ లో వర్తించదని ఆయన వాదించారు. అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని కోర్టుకు సాల్వే తెలపగా…దానికి కోర్టు అంగీకరించింది.
మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ జరిపిన హైకోర్టు…తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, కాబట్టి ఆ కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది.
This post was last modified on October 17, 2023 8:25 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…