రాష్ట్రం కోసం, రాష్ట్రప్రజల కోసం సీఎం జగన్ అనుక్షణం తపిస్తున్నారని.. కష్టపడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా విబాగం కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్రెడ్డి అన్నారు. బ్రిటన్ రాజధాని లండన్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి బ్రిటన్ వైసీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్రెడ్డి, వైసీపీ నేత ఓవుల్రెడ్డి నేతృత్వం వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఏపీ మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఏపీఎన్నార్టీఆఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్, ఏపీ ఎస్ ఎస్ డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఒకవైపు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అవినీతిపై ఎడతెగని పోరాటం చేస్తున్నారని తెలిపారు.
“ప్రజా సంక్షేమమే కాదు. అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి” అని సజ్జల భార్గవ్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు, ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంతో అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఈ అభివృద్ధి ఓ రేంజ్లో ఉందని, భారత దేశం వచ్చినప్పుడు దీనిని మీరు చూస్తే ఆశ్చర్య పోతారని భార్గవ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ నినదించిన వైనాట్ 175
ను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో అందరూ కలిసి నిర్ణయిద్దామన్నారు. 175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని సజ్జల భార్గవ్ రెడ్డి పిలుపునిచ్చారు. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా
అని సోషల్ మీడియా కార్యకర్తలకు అభయం ఇచ్చారు. కాగా, ఈ ఆత్మీయ సమావేశానికి బ్రిటన్ నలు మూలల నుంచి 450 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
This post was last modified on October 17, 2023 8:06 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…