తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలనే సంకల్పంతో సాగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పవనాలను ఓట్లుగా మార్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాల్లో మునిగిపోయారు. పార్టీ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. కానీ పార్టీలోని ఇతర నేతల నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో రేవంత్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలోని కొంతమంది నాయకుల నుంచి ఆయనకు సపోర్ట్ లభించని సంగతి తెలిసిందే. అయినా సవాళ్లను అధిగమిస్తూ కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలను రేవంత్ సమర్థంగా చేస్తున్నారనే టాక్ ఉంది. కేసీఆర్ ను , బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ దూసుకెళ్తున్నారనే చెప్పాలి. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సరైన పోటీనిచ్చే పార్టీగా కాంగ్రెస్ మారిందనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో టికెట్ల లొల్లి రేవంత్ మెడకు చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్వాల టికెట్ ను రేవంత్ రూ.10 కోట్లు, అయిదు ఎకరాల భూమికి అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మిగతా నియోజకవర్గాల టికెట్లనూ ఇలాగే అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారాయనే చెప్పాలి. ఇప్పటికే టికెట్ల కోసం రేవంత్ కోట్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడికి సొంత పార్టీ నేతలే రేవంత్ పై ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ కు కలిసొచ్చింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…