Political News

మంత్రాల‌ను న‌మ్ముకున్న ష‌ర్మిల‌?

అదేంటి.. అనుకుంటున్నారా? అవును. నిజ‌మే. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) అధ్య‌క్షురాలువైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు కీల‌క‌మైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రాల‌ను న‌మ్ముకున్నారు. పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఎన్నిక‌ల్లో ఎన్నిసీట్లు గెలుస్తుంది? అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఎప్పుడు ఏ ముహూర్తంలో ఇవ్వాలి? వంటి అనేక అంశాల‌పై ఆమె సిద్ధాంతుల‌ను న‌మ్ముకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోం ది.

ష‌ర్మిల మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ తాజాగా ఒంగోలు స‌మీపంలోని ప్ర‌ముఖ సిద్ధాంతిని క‌లిసి.. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ భ‌విత‌వ్యం, అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఇచ్చే అంశాల‌పై జాత‌కాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు మూడు గంట‌ల‌పాటు ఆమె స‌ద‌రు సిద్ధాంతితో చ‌ర్చ‌లు జ‌రిపి హైద‌రాబాద్కు చేరుకున్నారు. ఈ ప‌రిణామాల‌పై రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య‌ ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం సిద్ధాంతులు, మఠాల‌ను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో సీఎం జ‌గ‌న్ విశాఖ శార‌దా పీఠాన్ని న‌మ్ముకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న పీఠాన్ని సంద‌ర్శించి.. అక్క‌డే అభ్య‌ర్థుల విష‌యాన్ని పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామితో చ‌ర్చించారు. అలాగే.. తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తున్న ష‌ర్మిల కూడా స్వాములు, మంత్రుల‌ను న‌మ్ముకున్నార‌ని.. పోలింగ్ యంత్రాల‌ను ఏమేర‌కు క‌దిలించ‌గ‌లుగుతారో చూడాలని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తంగా ష‌ర్మిల-సిద్ధాంతుల వ్య‌వ‌హారం తెలంగాణ‌లోనే కాకుండా ఏపీలోనూ ఆస‌క్తిగా మారింది.

This post was last modified on October 14, 2023 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

51 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago