అదేంటి.. అనుకుంటున్నారా? అవును. నిజమే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైటీపీ) అధ్యక్షురాలువైఎస్ షర్మిల ప్రజలను పక్కన పెట్టి.. ఇప్పుడు కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రాలను నమ్ముకున్నారు. పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో ఎన్నిసీట్లు గెలుస్తుంది? అభ్యర్థులకు బీఫాంలు ఎప్పుడు ఏ ముహూర్తంలో ఇవ్వాలి? వంటి అనేక అంశాలపై ఆమె సిద్ధాంతులను నమ్ముకున్నట్టు స్పష్టంగా తెలుస్తోం ది.
షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తాజాగా ఒంగోలు సమీపంలోని ప్రముఖ సిద్ధాంతిని కలిసి.. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం, అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చే అంశాలపై జాతకాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు మూడు గంటలపాటు ఆమె సదరు సిద్ధాంతితో చర్చలు జరిపి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ పరిణామాలపై రాజకీయ నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం సిద్ధాంతులు, మఠాలను నమ్ముకుని ముందుకు సాగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో సీఎం జగన్ విశాఖ శారదా పీఠాన్ని నమ్ముకున్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పీఠాన్ని సందర్శించి.. అక్కడే అభ్యర్థుల విషయాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో చర్చించారు. అలాగే.. తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న షర్మిల కూడా స్వాములు, మంత్రులను నమ్ముకున్నారని.. పోలింగ్ యంత్రాలను ఏమేరకు కదిలించగలుగుతారో చూడాలని మరికొందరు అంటున్నారు. మొత్తంగా షర్మిల-సిద్ధాంతుల వ్యవహారం తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ ఆసక్తిగా మారింది.
This post was last modified on October 14, 2023 12:17 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…