రాజమండ్రి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా భువనేశ్వరిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు డీ హైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని, జైల్లోని కలుషిత నీరు, అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆయన ఆరోగ్యం పాడవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై, లోకేష్ ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని కేటీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసే సమయంలో తాను కూడా లోకేష్ మాదిరి ఆందోళన చెందానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ మరోసారి అన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు ఏపీలో, రాజమండ్రిలో చేసుకోవాలని హైదరాబాద్ లో వద్దని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ కామెంట్లపై హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో, మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డ్యామేజీ కంట్రోల్ లో భాగంగానే కేటీఆర్ తాజాగా చంద్రబాబు ఆరోగ్యం గురించి సానుభూతి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారని విమర్శలు వస్తున్నాయి.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…