ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ట్విట్టర్లో వెల్లడించాడు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ కొన్ని రోజుల కిందట జగన్ సర్కారు మద్యం పాలసీపై విరుచుకుపడుతూ ఓ వీడియో పెట్టాడు. అందులో మద్యం బాటిల్ పట్టుకున్న అతను.. ఏపీలో ఊరూ పేరూ లేని బ్రాండ్లను అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారని, దీని వల్ల తాను అప్పుల పాలు కావాల్సి వచ్చిందని అతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టిపోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐతే ఈ వీడియో బయటికి వచ్చిన ఐదు రోజులకే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం జగన్ను దూషించిన నేపథ్యంలో అతణ్ని చంపేస్తామని వైకాపా నాయకుల బెదిరించారని, పోలీసులు కూడా కేసులు పెడతామని హెచ్చరించారని.. ఈ భయంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఓం ప్రతాప్ దళితుడని, దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా.. వారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని నారా లోకేష్ అన్నారు.
This post was last modified on August 26, 2020 2:18 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…