Political News

ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలన ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ట్విట్టర్లో వెల్లడించాడు.

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ కొన్ని రోజుల కిందట జగన్ సర్కారు మద్యం పాలసీపై విరుచుకుపడుతూ ఓ వీడియో పెట్టాడు. అందులో మద్యం బాటిల్ పట్టుకున్న అతను.. ఏపీలో ఊరూ పేరూ లేని బ్రాండ్లను అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారని, దీని వల్ల తాను అప్పుల పాలు కావాల్సి వచ్చిందని అతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టిపోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐతే ఈ వీడియో బయటికి వచ్చిన ఐదు రోజులకే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం జగన్‌ను దూషించిన నేపథ్యంలో అతణ్ని చంపేస్తామని వైకాపా నాయకుల బెదిరించారని, పోలీసులు కూడా కేసులు పెడతామని హెచ్చరించారని.. ఈ భయంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఓం ప్రతాప్ దళితుడని, దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా.. వారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని నారా లోకేష్ అన్నారు.

This post was last modified on August 26, 2020 2:18 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

1 hour ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

1 hour ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago