స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 17 కు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణలు జరగనున్నాయి. ఫైబర్ నెట్ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, అంగళ్లు కేసులో ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చంద్రబాబు పీటీ వారెంట్లు, సిఐడి కస్టడీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు కూడా ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, చంద్రబాబు తరఫున సిఐడి అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై పాస్ ఓవర్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇక, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి తదుపరి విచారణ వాయిదా వేసింది.
This post was last modified on October 12, 2023 1:20 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…