స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 17 కు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణలు జరగనున్నాయి. ఫైబర్ నెట్ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, అంగళ్లు కేసులో ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చంద్రబాబు పీటీ వారెంట్లు, సిఐడి కస్టడీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు కూడా ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, చంద్రబాబు తరఫున సిఐడి అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై పాస్ ఓవర్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇక, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి తదుపరి విచారణ వాయిదా వేసింది.
This post was last modified on October 12, 2023 1:20 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…