స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 17 కు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణలు జరగనున్నాయి. ఫైబర్ నెట్ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, అంగళ్లు కేసులో ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చంద్రబాబు పీటీ వారెంట్లు, సిఐడి కస్టడీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు కూడా ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, చంద్రబాబు తరఫున సిఐడి అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై పాస్ ఓవర్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇక, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి తదుపరి విచారణ వాయిదా వేసింది.
This post was last modified on October 12, 2023 1:20 pm
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…