టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 341 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనను ఏపీ సీఐడీ జైలుకు పంపించింది. అయితే.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు అనేక రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ, అధికార పార్టీ వైసీపీ మాత్రం అదేం లేదు.. అసలు కుట్ర అనే మాటే లేదని ఇప్పటివరకు చెబుతూ వచ్చింది.
కానీ, తాజాగా చంద్రబాబు అరెస్టు, జైలుపై మంత్రి అంబటి రాంబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కుట్రను నిజమని అనుకునేలా చేయడం గమనార్హం. పైకి కక్ష సాధింపు లేదంటూనే.. “ఏం పీకుతాడు.. ఏం పీకుతాడు.. అని జగన్ మోహన్రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు రెండు పీకి సెంట్రల్ జైల్లో పెట్టాం. రాజశేఖరరెడ్డే నన్నేం పీకలేకపోయాడు. జగనేం పీకుతాడని చంద్రబాబు అన్నాడు. అందుకే రెండు పీకి జైల్లో పెట్టాం. నోరు పారేసుకుంటే ఇలానే ఉంటుంది. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది” అని అంబటి వ్యాఖ్యానించారు.
‘‘చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి?. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారు. టీడీపీ నాశనం అవ్వడానికి కారణం లోకేషే. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించాలి. నోరు పారేసుకోకుండా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడు. టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదు’’ అని అంబటి చెప్పుకొచ్చారు.
కాగా, ఈ నెల 26 నుంచి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నట్టు అంబటి రాంబాబు తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.
This post was last modified on October 11, 2023 1:21 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…