టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 341 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనను ఏపీ సీఐడీ జైలుకు పంపించింది. అయితే.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు అనేక రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ, అధికార పార్టీ వైసీపీ మాత్రం అదేం లేదు.. అసలు కుట్ర అనే మాటే లేదని ఇప్పటివరకు చెబుతూ వచ్చింది.
కానీ, తాజాగా చంద్రబాబు అరెస్టు, జైలుపై మంత్రి అంబటి రాంబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కుట్రను నిజమని అనుకునేలా చేయడం గమనార్హం. పైకి కక్ష సాధింపు లేదంటూనే.. “ఏం పీకుతాడు.. ఏం పీకుతాడు.. అని జగన్ మోహన్రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు రెండు పీకి సెంట్రల్ జైల్లో పెట్టాం. రాజశేఖరరెడ్డే నన్నేం పీకలేకపోయాడు. జగనేం పీకుతాడని చంద్రబాబు అన్నాడు. అందుకే రెండు పీకి జైల్లో పెట్టాం. నోరు పారేసుకుంటే ఇలానే ఉంటుంది. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది” అని అంబటి వ్యాఖ్యానించారు.
‘‘చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి?. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారు. టీడీపీ నాశనం అవ్వడానికి కారణం లోకేషే. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించాలి. నోరు పారేసుకోకుండా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడు. టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదు’’ అని అంబటి చెప్పుకొచ్చారు.
కాగా, ఈ నెల 26 నుంచి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నట్టు అంబటి రాంబాబు తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.
This post was last modified on October 11, 2023 1:21 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…