Political News

పయ్యావులతో చంద్రబాబు ఏం చెప్పారు?

సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ….జగన్ పై విమర్శలు గుప్పించారు. 151 సీట్ల అధికార మదం, రెండున్నర లక్షల కోట్ల ధన మదం కలగలిసిన జగన్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డీ…మిడిసిపడమాకు త్వరలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో గద్దె దించుతారని జోస్యం చెప్పారు.

ప్రజాధనాన్ని లాయర్లకు ఇచ్చి చంద్రబాబును జైల్లోనే ఎక్కువ కాలం ఉంచాలని జగన్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. జగన్ మాటల్లో అహంకారం కనబడుతోందని..చివరకు ధర్మం, న్యాయం గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల కోసం మూడ్రోజుల పాటు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం జగన్ పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పున:పంపిణీపై ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వలేకపోయిన చేతగాని, అసమర్ధుడు జగన్ అని ఎద్దేవా చేశారు.

మరోవైపు, చంద్రబాబుతో జైల్లో ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ములాఖత్ అయిన అనంతరం జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యర్థులు చంద్రబాబును మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నా ఆయన మానసికంగా మరింత దృఢంగా తయారయ్యారని పయ్యావుల అన్నారు. ప్రతి మాటా రాష్ట్రం కోసమే చంద్రబాబు మాట్లాడారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూన్నారని పయ్యావుల అన్నారు.

పార్టీకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాట పంథాను వీడొద్దండీ అని చంద్రబాబు తనతో అన్నారని చెప్పారు. తన గురించి, తన కేసుల గురించి మాట్లాడలేదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. చంద్రబాబును చూడగానే కొద్దిసేపు బాధ కలిగినా, ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూశాక ధైర్యం వచ్చిందని చెప్పారు.

This post was last modified on October 10, 2023 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago