ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కేసీయార్ యాక్టివ్ అయిపోతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి తన షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ లో 15వ తేదీన అభ్యర్ధులందరితో భేటీ పెట్టుకున్నారు. ఈలోగానే మ్యానిఫెస్టోకి రూపకల్పన చేయబోతున్నారు. అదే రోజు అందరికీ బీఫారాలు అందించాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడైనా అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేయాలంటే ఈలోపే చేసేయాలని కూడా అనుకున్నారు. 16వ తేదీన హుస్నాబాద్ లో ప్రచారాన్ని లాంఛనంగా మొదలుపెట్టి మరుసటి రోజునుండి జిల్లాల పర్యటనలో బిజీ అయిపోవాలని అనుకుంటున్నారు.
గతంలో ప్రకటించినట్లుగా 16వ తేదీన జరగాల్సిన వరంగల్ బహిరంగ సభ వాయిదా వేసుకున్నారు. నవంబర్ 9న గజ్వేలు, కామారెడ్డి లో నామినేషన్లు వేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి షెడ్యూల్ ప్రకటన అన్నది పార్టీల్లో ఒక్కసారిగా చురుకు పుట్టించింది. పైగా మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నది. ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాలనే విషయంలో ఇప్పటికే కేసీయార్ ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు.
చాలాకాలంగా హుస్నాబాద్ నుండి ఎన్నికల సభలు మొదలుపెట్టడం కేసీఆర్ సెంటిమెంటు. ఇపుడు కూడా అదే పద్దతిలో ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. 9 నెంబర్ అంటే కేసీయార్ కున్న సెంటిమెంటు కారణంగా అదేరోజు గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. అదేరోజు మధ్యాహ్నం కామారెడ్డిలో భారీ బహిరంగసభ కూడా జరపాలని అనుకున్నారు. పోటీచేస్తున్న రెండు నియోజకవర్గాల్లోను భారీ మెజారిటితో గెలవాలన్నది కేసీయార్ టార్టెట్. అందుకనే గజ్వేలు బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇక కామారెడ్డిలో గెలుపు బాధ్యతలను మంత్రి కేటీయార్ కు అప్పగించారు.
16వ తేదీన బహిరంగసభ 26 లేదా 27 తేదీల్లో జరగబోతోంది. రెగ్యులర్ గా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా అదే పద్దతిలో వారానికి ఒక సర్వే రిపోర్టు తెప్పించుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. గెలుపు లక్ష్యంతో అనుమానంగా ఉన్న నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎంఎల్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద బృందాన్ని రెడీ చేశారట. మొత్తానికి షెడ్యూల్ ప్రకటించటమే ఆలస్యం కేసీయార్ రంగంలోకి దిగేస్తున్నారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…