తెలంగాణా బీజేపీపై బండి సంజయ్ ప్రభావం చాలా ఉందని సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తీసేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు అగ్రనేతలు. నిజానికి బండిని తొలగించి కిషన్ కు బాధ్యతలు అప్పగించటం వల్ల పార్టీకి వచ్చిన లాభం ఏమీలేదు. అయినా సడెన్ గా బండిని పక్కనపెట్టేశారు. దాంతో అప్పట్లోనే బండిని తొలగించటం తప్పుడు నిర్ణయమని పార్టీలోని చాలామంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అగ్రనేతలకు స్పష్టంగా చెప్పారు కూడా.
అయితే ఎవరెంత చెప్పినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. అయితే బండి స్ధానంలో కిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇద్దరి మధ్య తేడా అర్ధమైపోయింది. బండి స్పీచులో ఉన్న పంచ్ కిషన్ మాటల్లో ఉండదు. ప్రతిరోజు బండి పార్టీ తరపున ఏదో ఒక కార్యక్రమం పెట్టేవారు. పాదయాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని ఏదో ఒకటి జనాలతో మమేకం అయ్యేట్లుగా షెడ్యూల్ ఉండేది. 24 గంటలూ 365 రోజులు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా బండి రాజకీయం ఉండేది.
పైగా బండి బీసీ నేత కాబట్టి బీసీల్లోను ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్, కదలిక ఉండేది. సీనియర్లందరినీ బండి కలుపుకుని వెళ్ళేవారు కాదనే ఆరోపణలు తరచూ వినబడేవి. అయితే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి ఆరోపణలు మామూలే. ఎందుకంటే అధ్యక్షుడిగా ఎవరున్నా నేతలందరు మూకుమ్మడిగా మద్దతు తెలపటం అన్నది ఎప్పుడూ ఉండదు. కాబట్టి సీనియర్లలో కొందరికి ఎప్పటికీ అధ్యక్షుడిపైన అసంతృప్తి ఉంటుంది.
అయితే ఇపుడు తెలంగాణాలో పరిస్ధితులను గమనించిన తర్వాత బండిని తొలగించి తప్పుచేశామనే ఆలోచన ఢిల్లీ పెద్దల్లో మొదలైందని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే బీజేపీలో చేరటానికి ఇతర పార్టీల నేతలు పెద్దగా ముందుకు రావటంలేదట. ఎందుకంటే పార్టీలో జోష్ పడిపోవటమే కాకుండా అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా పడిపోయిందట. నవంబర్ 30 వ తేదీ పోలింగ్ కు ముందు బీజేపీపై ఇలాంటి ముద్ర పడటం మంచిది కాదని అగ్రనేతలు అనుకుంటున్నారట. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో అగ్రనేతలు ఎలాగ ఆలోచించినా ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.
This post was last modified on October 10, 2023 1:11 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…