తెలంగాణా బీజేపీపై బండి సంజయ్ ప్రభావం చాలా ఉందని సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తీసేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు అగ్రనేతలు. నిజానికి బండిని తొలగించి కిషన్ కు బాధ్యతలు అప్పగించటం వల్ల పార్టీకి వచ్చిన లాభం ఏమీలేదు. అయినా సడెన్ గా బండిని పక్కనపెట్టేశారు. దాంతో అప్పట్లోనే బండిని తొలగించటం తప్పుడు నిర్ణయమని పార్టీలోని చాలామంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అగ్రనేతలకు స్పష్టంగా చెప్పారు కూడా.
అయితే ఎవరెంత చెప్పినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. అయితే బండి స్ధానంలో కిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇద్దరి మధ్య తేడా అర్ధమైపోయింది. బండి స్పీచులో ఉన్న పంచ్ కిషన్ మాటల్లో ఉండదు. ప్రతిరోజు బండి పార్టీ తరపున ఏదో ఒక కార్యక్రమం పెట్టేవారు. పాదయాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని ఏదో ఒకటి జనాలతో మమేకం అయ్యేట్లుగా షెడ్యూల్ ఉండేది. 24 గంటలూ 365 రోజులు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా బండి రాజకీయం ఉండేది.
పైగా బండి బీసీ నేత కాబట్టి బీసీల్లోను ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్, కదలిక ఉండేది. సీనియర్లందరినీ బండి కలుపుకుని వెళ్ళేవారు కాదనే ఆరోపణలు తరచూ వినబడేవి. అయితే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి ఆరోపణలు మామూలే. ఎందుకంటే అధ్యక్షుడిగా ఎవరున్నా నేతలందరు మూకుమ్మడిగా మద్దతు తెలపటం అన్నది ఎప్పుడూ ఉండదు. కాబట్టి సీనియర్లలో కొందరికి ఎప్పటికీ అధ్యక్షుడిపైన అసంతృప్తి ఉంటుంది.
అయితే ఇపుడు తెలంగాణాలో పరిస్ధితులను గమనించిన తర్వాత బండిని తొలగించి తప్పుచేశామనే ఆలోచన ఢిల్లీ పెద్దల్లో మొదలైందని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే బీజేపీలో చేరటానికి ఇతర పార్టీల నేతలు పెద్దగా ముందుకు రావటంలేదట. ఎందుకంటే పార్టీలో జోష్ పడిపోవటమే కాకుండా అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా పడిపోయిందట. నవంబర్ 30 వ తేదీ పోలింగ్ కు ముందు బీజేపీపై ఇలాంటి ముద్ర పడటం మంచిది కాదని అగ్రనేతలు అనుకుంటున్నారట. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో అగ్రనేతలు ఎలాగ ఆలోచించినా ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.
This post was last modified on October 10, 2023 1:11 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…