టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించనున్న సంగతి తెలిసిందే. మురోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు జడ్జిమెంట్ డే అని, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా భావించారు. కానీ, తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేశారు. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, రిమాండ్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో, ఏసీబీ కోర్టులోనైనా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేక సీఐడీ కస్టడీకి ఇస్తుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. వాస్తవానికి అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ కేసులో నిందితులందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చింది.
This post was last modified on October 9, 2023 11:59 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…