టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించనున్న సంగతి తెలిసిందే. మురోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు జడ్జిమెంట్ డే అని, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా భావించారు. కానీ, తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేశారు. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, రిమాండ్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో, ఏసీబీ కోర్టులోనైనా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేక సీఐడీ కస్టడీకి ఇస్తుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. వాస్తవానికి అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ కేసులో నిందితులందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చింది.
This post was last modified on October 9, 2023 11:59 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…