టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించనున్న సంగతి తెలిసిందే. మురోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు జడ్జిమెంట్ డే అని, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా భావించారు. కానీ, తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేశారు. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, రిమాండ్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో, ఏసీబీ కోర్టులోనైనా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేక సీఐడీ కస్టడీకి ఇస్తుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. వాస్తవానికి అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ కేసులో నిందితులందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చింది.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…