టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించనున్న సంగతి తెలిసిందే. మురోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు జడ్జిమెంట్ డే అని, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా భావించారు. కానీ, తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేశారు. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, రిమాండ్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో, ఏసీబీ కోర్టులోనైనా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేక సీఐడీ కస్టడీకి ఇస్తుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. వాస్తవానికి అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ కేసులో నిందితులందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చింది.
This post was last modified on October 9, 2023 11:59 am
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…