టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఏపీ ఫైబర్ నెట్ స్కాం ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ల పై సీఐడీ విచారణ జరిపే అవకాశముంది. ఈ క్రమంలోనే అసలు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ఏమిటి అన్న విషయాలను తెలియజేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చింది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ పుస్తకాన్ని మంగళగిరిలో విడుదల చేశారు. చంద్రబాబు ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని, తమ నేతకు అవినీతి మరక అంటుకునే అవకాశమే లేదని అచ్చెన్న చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 30 రోజులైందని, ఒక్క పైసా అవినీతి జరిగిందని కూడా నిరూపించలేకపోయారని పయ్యావుల ఎద్దేవా చేశారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని జగన్ కు, మిగతా వారికి కూడా తెలుసని, కక్ష సాధింపులో భాగంగానే కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారని పయ్యావుల విమర్శించారు.
This post was last modified on October 8, 2023 10:11 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…