టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఏపీ ఫైబర్ నెట్ స్కాం ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ల పై సీఐడీ విచారణ జరిపే అవకాశముంది. ఈ క్రమంలోనే అసలు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ఏమిటి అన్న విషయాలను తెలియజేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చింది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ పుస్తకాన్ని మంగళగిరిలో విడుదల చేశారు. చంద్రబాబు ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని, తమ నేతకు అవినీతి మరక అంటుకునే అవకాశమే లేదని అచ్చెన్న చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 30 రోజులైందని, ఒక్క పైసా అవినీతి జరిగిందని కూడా నిరూపించలేకపోయారని పయ్యావుల ఎద్దేవా చేశారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని జగన్ కు, మిగతా వారికి కూడా తెలుసని, కక్ష సాధింపులో భాగంగానే కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారని పయ్యావుల విమర్శించారు.
This post was last modified on October 8, 2023 10:11 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…