Political News

జగన్ సర్కారుకు మింగుడుపడని రీతిలో హైకోర్టు తాజా ఆదేశం

వైద్యుడిగా సుపరిచితుడు.. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమానుల్లో ఒకరుగా పేరున్న డాక్టర్ రమేశ్ పై ఏపీ సర్కారు చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మరణించటం.. దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలు కావటం తలెిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకున్న రమేశ్ ఆసుపత్రి.. అక్కడ కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

అయితే.. అక్కడి నిర్వహణ లోపాల కారణంతో పాటు.. నిబంధనలను పట్టించుకోని కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్వహణ లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబుతో సహా పలువురుపైన కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో డాక్టర్ రమేశ్ బాబుతో సహా పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కోవిడ్ కేర్ కు అనుమతులు ఇచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు.. అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా? అని వ్యాఖ్యానించింది.

దీంతో.. కలుగజేసుకున్న ప్రభుత్వం తరఫు న్యాయవాది.. కేసు విచారణ దశలో ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్రమేశ్ బాబుతో పాటు సీతారమ్మోహన్ రావుపై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాస్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. రమేశ్ ఆసుపత్రిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్న ఏపీ అధికారుల ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లుగా చెప్పక తప్పదు.

This post was last modified on August 25, 2020 7:05 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

45 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

3 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

5 hours ago