వైద్యుడిగా సుపరిచితుడు.. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమానుల్లో ఒకరుగా పేరున్న డాక్టర్ రమేశ్ పై ఏపీ సర్కారు చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మరణించటం.. దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలు కావటం తలెిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకున్న రమేశ్ ఆసుపత్రి.. అక్కడ కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
అయితే.. అక్కడి నిర్వహణ లోపాల కారణంతో పాటు.. నిబంధనలను పట్టించుకోని కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్వహణ లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబుతో సహా పలువురుపైన కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ రమేశ్ బాబుతో సహా పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కోవిడ్ కేర్ కు అనుమతులు ఇచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు.. అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా? అని వ్యాఖ్యానించింది.
దీంతో.. కలుగజేసుకున్న ప్రభుత్వం తరఫు న్యాయవాది.. కేసు విచారణ దశలో ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్రమేశ్ బాబుతో పాటు సీతారమ్మోహన్ రావుపై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాస్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. రమేశ్ ఆసుపత్రిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్న ఏపీ అధికారుల ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లుగా చెప్పక తప్పదు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…