తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే.
విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీయార్ వస్తేనే ఉపయోగముంటుందని అనుకోవటం. అంట మంత్రులు, ఎంఎల్ఏలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకు కూడా జనాల్లో పట్టులేదని అర్ధమైపోతోంది. వీళ్ళల్లో ఇంతగా టెన్షన్ పెరిగిపోతుండటానికి ప్రధాన కారణం ఏమిటంట కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుండటమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతోంది. ఈ పబ్లిసిటీయే బీఆర్ఎస్ లో బాగా టెన్షన్ పెంచేస్తోంది.
రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్ల ఇవ్వటమే. దీనివల్ల ఏమైందంటే ముదు పార్టీ నేతలు, క్యాడర్లోనే చాలామంది సిట్టింగులపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉంది. దానికితోడు జనాలు కూడా బాగా విసిగిపోయున్నారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా కేసీయార్ మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చారు. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
This post was last modified on October 8, 2023 1:59 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…