తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే.
విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీయార్ వస్తేనే ఉపయోగముంటుందని అనుకోవటం. అంట మంత్రులు, ఎంఎల్ఏలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకు కూడా జనాల్లో పట్టులేదని అర్ధమైపోతోంది. వీళ్ళల్లో ఇంతగా టెన్షన్ పెరిగిపోతుండటానికి ప్రధాన కారణం ఏమిటంట కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుండటమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతోంది. ఈ పబ్లిసిటీయే బీఆర్ఎస్ లో బాగా టెన్షన్ పెంచేస్తోంది.
రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్ల ఇవ్వటమే. దీనివల్ల ఏమైందంటే ముదు పార్టీ నేతలు, క్యాడర్లోనే చాలామంది సిట్టింగులపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉంది. దానికితోడు జనాలు కూడా బాగా విసిగిపోయున్నారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా కేసీయార్ మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చారు. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…