తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే.
విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీయార్ వస్తేనే ఉపయోగముంటుందని అనుకోవటం. అంట మంత్రులు, ఎంఎల్ఏలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకు కూడా జనాల్లో పట్టులేదని అర్ధమైపోతోంది. వీళ్ళల్లో ఇంతగా టెన్షన్ పెరిగిపోతుండటానికి ప్రధాన కారణం ఏమిటంట కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుండటమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతోంది. ఈ పబ్లిసిటీయే బీఆర్ఎస్ లో బాగా టెన్షన్ పెంచేస్తోంది.
రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్ల ఇవ్వటమే. దీనివల్ల ఏమైందంటే ముదు పార్టీ నేతలు, క్యాడర్లోనే చాలామంది సిట్టింగులపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉంది. దానికితోడు జనాలు కూడా బాగా విసిగిపోయున్నారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా కేసీయార్ మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చారు. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…