తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే.
విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీయార్ వస్తేనే ఉపయోగముంటుందని అనుకోవటం. అంట మంత్రులు, ఎంఎల్ఏలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకు కూడా జనాల్లో పట్టులేదని అర్ధమైపోతోంది. వీళ్ళల్లో ఇంతగా టెన్షన్ పెరిగిపోతుండటానికి ప్రధాన కారణం ఏమిటంట కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుండటమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతోంది. ఈ పబ్లిసిటీయే బీఆర్ఎస్ లో బాగా టెన్షన్ పెంచేస్తోంది.
రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్ల ఇవ్వటమే. దీనివల్ల ఏమైందంటే ముదు పార్టీ నేతలు, క్యాడర్లోనే చాలామంది సిట్టింగులపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉంది. దానికితోడు జనాలు కూడా బాగా విసిగిపోయున్నారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా కేసీయార్ మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చారు. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
This post was last modified on October 8, 2023 1:59 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…