Political News

వీళ్ళు డిసైడ్ అయిపోయారా ?

తెలంగాణా బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించటానికి నలుగురు నేతలు డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. అందుకనే కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశానికి నలుగురు నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్రనాధరెడ్డి గైర్హాజరయ్యారు. వీళ్ళు నలుగురు మొన్నటి నరేంద్ర మోదీ పర్యటనలో కూడా కనబడలేదు. పార్టీ మీటింగులకు కూడా పెద్దగా హాజరుకావటంలేదు. ఈ నలుగురి సమస్య ఏమిటో పార్టీ నేతలకు అర్ధంకావటంలేదు.

బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నంతవరకు వీళ్ళు కాస్త యాక్టివ్ గానే ఉండేవారు. కిషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళ వ్యవహారశైలిలో మార్పొచ్చేసింది. పదాదికారుల సమావేశం అంటే పార్టీలో కీలకమైన సమావేశమనే చెప్పాలి. పైగా ఏనుగు తప్ప మిగిలిన ముగ్గురు తాజాగా వేసిన 14 ఎన్నికల కమిటీల్లో ఉన్నారు. పార్టీపరంగా వీళ్ళకి బాగానే ప్రధాన్యత దక్కుతున్నదనే చెప్పాలి. అయినా వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటేనే కారణాలు ఏమిటో అర్ధంకావటం లేదు.

ఈ అసంతృప్త నేతలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు కూడా గ్యారెంటీ అని అర్ధమవుతోంది. ఇపుడు పదవులూ దక్కాయి, రేపటి ఎన్నికల్లో టికెట్లూ గ్యారెంటీనే అయినా ఎందుకు అసంతృప్తి ? అన్నదే అర్ధంకావటంలేదు. ఏరోజుకారోజు వీళ్ళు పార్టీ మారటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి భువనగిరి ఎంపీగా కానీ లేదా మునుగోడు ఎంఎల్ఏగా కాని కాంగ్రెస్ లో టికెట్ ఇప్పించేందుకు సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఏదేమైనా ఈ నలుగురి వ్యవహార శైలి పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ అసంతృప్త నేతల బాటలోనే ఇంకా ఎంతమంది నేతలు నడవటానికి రెడీగా ఉన్నారో తెలీటంలేదు. ఎక్కడిక్కడ మీటింగులు పెట్టుకుని కిషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే కిషన్ పైన వ్యతిరేకంగా చివరకు మోడీ మీటింగులకు కూడా గైర్హాజరయ్యారంటేనే అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమైపోతోంది. మరి చివరకు వీళ్ళు ఏమిచేస్తారో నాయకత్వానికి అర్ధమే కావటంలేదు.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

3 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

3 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

5 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

7 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

8 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

8 hours ago