కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయటానికి వైఎస్ షర్మిల నో చెప్పేశారట. ఈ విషయాన్ని పార్టీ నేతలు చెప్పారు. విలీనం కోసం కాంగ్రెస్ అధిష్టానం విధించిన షరతులు షర్మిలకు ఆమోదయోగ్యంగా లేదట. అందుకనే విలీనం ప్రక్రియకు షర్మిల బ్రేకులు వేసేశారట. ఇందులో భాగంగానే ఈరోజు పార్టీ ఆపీసులో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని కూడా షర్మిల శుక్రవారం కోటరీ సమావేశంలో చెప్పారట.
ఆ నిర్ణయాన్నే శనివారం జరగబోయే ముఖ్య నేతల సమావేశంలో చర్చించి తీర్మానం చేయబోతున్నారు. జిల్లాల కన్వీనర్లకు, నియోజకవర్గాల కన్వీనర్లకు కూడా ఈ సమాచారాన్ని ఇప్పటికే షర్మిల పంపినట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న నేతల నుండి పోటీకి దరఖాస్తులు తీసుకోవాలని కూడా డిసైడ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే లేదా 9, 10 తేదీల్లో బీఫారాలు అందించాలని కూడా షర్మిల అనుకున్నారట.
మొదటి నుండి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సీనియర్ నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎంతమంది వ్యతిరేకించినా షర్మిల మాత్రం ముందుకెళిపోయారు. అందుకనే కొండా, గట్టు, ఏపూరి పార్టీకి రాజీనామాలు చేశారు. దాదాపు మూడునెలలుగా పొత్తా ? విలీనమా ? అనే విషయం రెండుపార్టీల మధ్య నానుతున్న విషయం తెలిసిందే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో జరిగిన భేటీలో చివరకు విలీనంకు షర్మిల అంగీకరించారు.
ఆ తర్వాతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక తో కలిసి షర్మిల బ్రేక్ పాస్ట్ కూడా చేశారు. అధిష్టానమేమో షర్మిలకు ఏపీ పార్టీపగ్గాలు అప్పగించాలని అనుకున్నది. అయితే అందుకు షర్మిల అంగీకరించలేదు. తాను తెలంగాణాలోనే కంటిన్యు అవుతానని చెప్పారు. దీనికి తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తానికి విలీనం ఆగిపోవటంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి బరిలోకి దిగాలని షర్మిల డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.
This post was last modified on October 7, 2023 10:52 am
రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు…
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…