సీఎం జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు పుణ్యమా అంటూ ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇటువంటి నేపథ్యంలోనే సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
భీమవరం, నెల్లూరు వంటి ప్రాంతాలలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, కావాలంటే జగనన్నకు చెప్పి స్థలం ఇప్పిస్తానని ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన మాటల్లో తప్పేం లేదని, తెలంగాణతో పాటు ఏపీ అదే మాదిరిగా దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణలకు చెందిన యువత ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని, ఇక్కడే ఐటీ కంపెనీలు వస్తే వారంతా తమ స్వస్థలాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. వరంగల్ లో యువతకు వరంగల్ లోనే ఉద్యోగాలు దొరికే లాగా ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
దేశం అంతా బాగుండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, కులం, మతం అంటూ కొట్టుకుంటే ఏం వస్తుందని పరోక్షంగా బీజేపీకి కేటీఆర్ చురకలంటించారు. వాస్తవానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో తప్పుబట్టడానికి ఏమీ లేదు. కానీ, ఏపీలో స్వతహాగానే పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావాలి.
This post was last modified on October 6, 2023 8:39 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…