Political News

ఐటీ కంపెనీ పెట్టండి..జగనన్నకు చెబుతా: కేటీఆర్

సీఎం జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు పుణ్యమా అంటూ ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇటువంటి నేపథ్యంలోనే సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

భీమవరం, నెల్లూరు వంటి ప్రాంతాలలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, కావాలంటే జగనన్నకు చెప్పి స్థలం ఇప్పిస్తానని ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన మాటల్లో తప్పేం లేదని, తెలంగాణతో పాటు ఏపీ అదే మాదిరిగా దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణలకు చెందిన యువత ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని, ఇక్కడే ఐటీ కంపెనీలు వస్తే వారంతా తమ స్వస్థలాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. వరంగల్ లో యువతకు వరంగల్ లోనే ఉద్యోగాలు దొరికే లాగా ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

దేశం అంతా బాగుండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, కులం, మతం అంటూ కొట్టుకుంటే ఏం వస్తుందని పరోక్షంగా బీజేపీకి కేటీఆర్ చురకలంటించారు. వాస్తవానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో తప్పుబట్టడానికి ఏమీ లేదు. కానీ, ఏపీలో స్వతహాగానే పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావాలి.

This post was last modified on October 6, 2023 8:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

3 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

4 hours ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

10 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

10 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

10 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

12 hours ago