Political News

చంద్రబాబుపై నక్సల్స్ దాడి…లోకేష్ సంచలన ఆరోపణలు

రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ నేతలు చాలాకాలంగా ఆందోళన చెందుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును హౌస్ రిమాండ్ కు ఇవ్వాలని కోరినా…కోర్టు అనుమతించలేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్…చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలుపై, చంద్రబాబుపై దాడి చేస్తామని ఎస్పీకి కొందరు నక్సలైట్లు లేఖ రాశారని లోకేష్ చెప్పారు.

ఆల్రెడీ జైల్లో కొందరు నక్సల్స్‌, గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నవారు ఉన్నారని లోకేష్ అన్నారు. 45 ఏళ్లపాటు చంద్రబాబు ప్రజల కోసం చాలామందిపై పోరాడారని, అటువంటి వ్యక్తులతో పాటు చంద్రబాబు జైల్లో ఉండడంతో ఆయన భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం ఆగదని, టీడీపీ – జనసేన కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు పోతామని అన్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని, జైల్లో ఉన్నా ప్రజల గురించే ఆయన ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, పిచ్చి జగన్ కన్నా ముందే తిరుమల కొండ ఎక్కారని అన్నారు.

ఆయన అధైర్యపడలేదని, పోరాటం ఆపవద్దని, శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని అన్నారు. న్యాయం ఆలస్యం అయినా తమ వైపే ఉంటుందని, అందులో సందేహం లేదని చెప్పారు. తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందని, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడతామని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ఇతర పార్టీల నేతలను కలిసి ఏపీలో పరిస్థితి వివరించామని చెప్పారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని, కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని వారంతా తనకు భరోసానిచ్చారని లోకేష్ అన్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

4 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

5 hours ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

11 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

11 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

11 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

13 hours ago