Political News

స్కూళ్ల మీద క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్

కరోనా వేళ.. ఎవరింట్లో వారు ఉండటం.. అవసరమైతే తప్పించి బయటకు రాకుడదన్న ప్రాథమిక సూత్రాన్నిపక్కన పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ ఏడాదికి సర్కారీ స్కూళ్ల పరిస్థితి ఏమిటన్న అంశంపై గందరగోళం నెలకొన్న వేళ.. పుల్ క్లారిటీ ఇచ్చేస్తూ.. తాజాగా ఆదేశాల్ని జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్ని ఓపెన్ చేసి.. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పేలా నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఈ నెల 27 (ఎల్లుండి) నుంచి టీచర్లంతా స్కూళ్లకు హాజరు కావాలని.. సెప్టెంబరు 1 నుంచి దూరదర్శన్.. టీసాట్ ఛానల్ ద్వారా పాఠాలు చెప్పాలని డిసైడ్ చేశారు. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి కంటెంట్ ను టీచర్లు సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆన్ లైన్ లో క్లాసులే తప్పించి.. స్కూళ్లను తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని చెప్పేసింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యార్థులకు స్కూళ్లలో అనుమతి లేదని పేర్కొంది. వాస్తవానికి తొలుత తీసుకున్న నిర్ణయానికి.. తాజాగా జారీ అయిన ఆదేశాలకు సంబంధం లేకపోవటం గమనార్హం. తొలుత.. టీచర్లంతా స్కూళ్లకు వెళ్లాలని పేర్కొంటూనే.. కనీసం యాభై శాతం మంది బడుల్లో ఉండాలన్నారు. తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో మాత్రం.. ప్రతి ఒక్క టీచర్ స్కూళ్లకు వెళ్లాల్సిందేనని తేల్చేశారు.

సర్కారీ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. టీవీలు కూడా లేవని తేలింది. ఇలాంటివేళలో.. ఆన్ లైన్ క్లాసులకు వారిని ఎలా అటెండ్ అయ్యేలా చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ప్రతి గ్రామంలోనూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థిని గుర్తించి మెంటారర్ గా వినియోగించే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పజెప్పాలని నిర్ణయించారు. వీరంతా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్ని ఆన్ లైన్ పాఠాలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి.. కేసీఆర్ సర్కారు ప్లాన్ ఎంతమేర వర్క్ వుట్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 25, 2020 12:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…

6 minutes ago

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…

10 minutes ago

బుక్ మై షోలో ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…

2 hours ago

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…

3 hours ago

ఇంటరెస్టింగ్ డే : శ్రీవిష్ణు VS సామ్

కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…

3 hours ago

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…

11 hours ago