Political News

ఏఏజీ పొన్నవోలుపై జడ్జి అసహనం

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ రోజు వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు వాదనలు వింటామని చెప్పింది. మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఏపీ హైకోర్టు రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.

అంతకుముందు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాడీవేడి వాదనలు జరిగాయి. ఆనాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే.సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేశారని, ఆ తర్వాత సీమెన్స్ ప్రాజెక్టు ఎటువంటి అభ్యంతరం లేకుండా కేబినెట్ ఆమోదం పొందిందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. అది కేబినెట్ నిర్ణయం అని, చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, ఆ కమిటీలో చంద్రబాబు లేరని వాదనలు వినిపించారు.

ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్నారని తెలిపారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు నోటీసివ్వకుండా అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేపట్టారని అన్నారు. రెండు రోజుల కస్టడీలోనూ సీఐడీ అధికారులు విచారణ జరిపి మళ్లీ కస్టడీ కావాలంటున్నారని, ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పిన అంశాలను పదేపదే ఎందుకు చెబుతున్నారని ,నేరానికి సంబంధించిన ఆధారాలుంటే చూపాలని అసహనం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌ల సమయంలో చెప్పిన వాదనలే మళ్లీ చెబుతున్నారని అన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వండి, చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటాం అసహనం వ్యక్తం చేశారు.

This post was last modified on October 4, 2023 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago