Political News

రాహుల్ లో సమూలమైన మార్పు

తిరుగులేని నేతగా ఎదగాలంటే జనాల మద్దతు ఉండాల్సిందే అని రాహుల్ గాంధీకి ఇంతకాలానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇన్ని సంవత్సరాల అంతఃపురం రాజకీయాలను వదిలేసి రోడ్లమీదకు వచ్చారు. తాజాగా రెండురోజులుగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో ఉంటున్నారు. స్వర్ణదేవాలయంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే అన్నం పెడతారని కాదు రొట్టెలే ముఖ్యం. ప్రతిరోజు దేవాలయానికి రకరకాల జనాలు వస్తుంటారు. స్వర్ణదేవాలయం అంటే పంజాబ్ ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాశాలు.

అందుకనే రెండురోజులుగా రాహుల్ దేవాలయంలోనే గడిపారు. వంటగదిలో కూర్చుని మిగిలిన వాళ్ళతో కలిసి రొట్టెలు, దాల్, చావల్ చేశారు. తర్వాత వంటపాత్రలు కడిగారు. భక్తులకు భోజనం వడ్డించారు. దేవాలయం ఆవరణను శుభ్రం చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులను కలిసి మాట్లాడారు. దేవాలయంలోనే భక్తులతో కలిసి భజనలు చేశారు. ఇదంతా రాహుల్ చేసింది ఫక్తు రాజకీయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజకీయ నేతలు రాజకీయమే చేస్తారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మామూలు భక్తుల్లాగ రాహుల్ స్వర్ణదేవాలయంలో మిగిలిన అందరితో కలిసిపోవటమే. ప్రజల్లో ఒకడిగా మమేకం అయిపోయినపుడే జనాలు కూడా రాహుల్ ను గుర్తుంచుకుంటారు. అందుకనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్రచేసింది. పాదయాత్ర చేయటమే రాహుల్ దృక్పదాన్ని మార్చిందని చెప్పాలి. అప్పటినుండే ట్రక్కు డ్రైవర్ గా, మెకానిక్కుగా, దాబాల్లో భోజనం, లారీల్లో ప్రయాణం, గ్రామీణ ప్రాంతంలోని యువకులతో కలిసి వంటలు తయారుచేయటం లాంటి అజెండాతో చొచ్చుకుని పోతున్నారు.

ఇలాంటి అజెండానే రాహుల్ ను సామాన్య జనాలకు దగ్గరచేస్తున్నది. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే జనాలను కలవటం, సమస్యలపై చర్చించటం, పరిష్కారాలపై మాట్లాడటం అన్నది ప్రతిపక్షంలో ఉన్నపుడే సాధ్యమవుతుంది. పొరబాటున అధికారంలోకి వచ్చేస్తే ఈపనులన్నీ సాధ్యంకాదు. ఈ విషయాన్ని రాహుల్ కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఎలాగుంటుందన్నది ఎన్నికల ఫలితాలు వస్తేకానీ తెలీదు. ఈలోపు జనాల మనిషి అనిపించుకోవటమే రాహుల్ కు చాలా ముఖ్యం.

This post was last modified on October 4, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago