Political News

రాహుల్ లో సమూలమైన మార్పు

తిరుగులేని నేతగా ఎదగాలంటే జనాల మద్దతు ఉండాల్సిందే అని రాహుల్ గాంధీకి ఇంతకాలానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇన్ని సంవత్సరాల అంతఃపురం రాజకీయాలను వదిలేసి రోడ్లమీదకు వచ్చారు. తాజాగా రెండురోజులుగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో ఉంటున్నారు. స్వర్ణదేవాలయంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే అన్నం పెడతారని కాదు రొట్టెలే ముఖ్యం. ప్రతిరోజు దేవాలయానికి రకరకాల జనాలు వస్తుంటారు. స్వర్ణదేవాలయం అంటే పంజాబ్ ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాశాలు.

అందుకనే రెండురోజులుగా రాహుల్ దేవాలయంలోనే గడిపారు. వంటగదిలో కూర్చుని మిగిలిన వాళ్ళతో కలిసి రొట్టెలు, దాల్, చావల్ చేశారు. తర్వాత వంటపాత్రలు కడిగారు. భక్తులకు భోజనం వడ్డించారు. దేవాలయం ఆవరణను శుభ్రం చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులను కలిసి మాట్లాడారు. దేవాలయంలోనే భక్తులతో కలిసి భజనలు చేశారు. ఇదంతా రాహుల్ చేసింది ఫక్తు రాజకీయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజకీయ నేతలు రాజకీయమే చేస్తారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మామూలు భక్తుల్లాగ రాహుల్ స్వర్ణదేవాలయంలో మిగిలిన అందరితో కలిసిపోవటమే. ప్రజల్లో ఒకడిగా మమేకం అయిపోయినపుడే జనాలు కూడా రాహుల్ ను గుర్తుంచుకుంటారు. అందుకనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్రచేసింది. పాదయాత్ర చేయటమే రాహుల్ దృక్పదాన్ని మార్చిందని చెప్పాలి. అప్పటినుండే ట్రక్కు డ్రైవర్ గా, మెకానిక్కుగా, దాబాల్లో భోజనం, లారీల్లో ప్రయాణం, గ్రామీణ ప్రాంతంలోని యువకులతో కలిసి వంటలు తయారుచేయటం లాంటి అజెండాతో చొచ్చుకుని పోతున్నారు.

ఇలాంటి అజెండానే రాహుల్ ను సామాన్య జనాలకు దగ్గరచేస్తున్నది. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే జనాలను కలవటం, సమస్యలపై చర్చించటం, పరిష్కారాలపై మాట్లాడటం అన్నది ప్రతిపక్షంలో ఉన్నపుడే సాధ్యమవుతుంది. పొరబాటున అధికారంలోకి వచ్చేస్తే ఈపనులన్నీ సాధ్యంకాదు. ఈ విషయాన్ని రాహుల్ కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఎలాగుంటుందన్నది ఎన్నికల ఫలితాలు వస్తేకానీ తెలీదు. ఈలోపు జనాల మనిషి అనిపించుకోవటమే రాహుల్ కు చాలా ముఖ్యం.

This post was last modified on October 4, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

2 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

2 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

3 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

3 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

5 hours ago