Political News

రాహుల్ లో సమూలమైన మార్పు

తిరుగులేని నేతగా ఎదగాలంటే జనాల మద్దతు ఉండాల్సిందే అని రాహుల్ గాంధీకి ఇంతకాలానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇన్ని సంవత్సరాల అంతఃపురం రాజకీయాలను వదిలేసి రోడ్లమీదకు వచ్చారు. తాజాగా రెండురోజులుగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో ఉంటున్నారు. స్వర్ణదేవాలయంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే అన్నం పెడతారని కాదు రొట్టెలే ముఖ్యం. ప్రతిరోజు దేవాలయానికి రకరకాల జనాలు వస్తుంటారు. స్వర్ణదేవాలయం అంటే పంజాబ్ ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాశాలు.

అందుకనే రెండురోజులుగా రాహుల్ దేవాలయంలోనే గడిపారు. వంటగదిలో కూర్చుని మిగిలిన వాళ్ళతో కలిసి రొట్టెలు, దాల్, చావల్ చేశారు. తర్వాత వంటపాత్రలు కడిగారు. భక్తులకు భోజనం వడ్డించారు. దేవాలయం ఆవరణను శుభ్రం చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులను కలిసి మాట్లాడారు. దేవాలయంలోనే భక్తులతో కలిసి భజనలు చేశారు. ఇదంతా రాహుల్ చేసింది ఫక్తు రాజకీయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజకీయ నేతలు రాజకీయమే చేస్తారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మామూలు భక్తుల్లాగ రాహుల్ స్వర్ణదేవాలయంలో మిగిలిన అందరితో కలిసిపోవటమే. ప్రజల్లో ఒకడిగా మమేకం అయిపోయినపుడే జనాలు కూడా రాహుల్ ను గుర్తుంచుకుంటారు. అందుకనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్రచేసింది. పాదయాత్ర చేయటమే రాహుల్ దృక్పదాన్ని మార్చిందని చెప్పాలి. అప్పటినుండే ట్రక్కు డ్రైవర్ గా, మెకానిక్కుగా, దాబాల్లో భోజనం, లారీల్లో ప్రయాణం, గ్రామీణ ప్రాంతంలోని యువకులతో కలిసి వంటలు తయారుచేయటం లాంటి అజెండాతో చొచ్చుకుని పోతున్నారు.

ఇలాంటి అజెండానే రాహుల్ ను సామాన్య జనాలకు దగ్గరచేస్తున్నది. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే జనాలను కలవటం, సమస్యలపై చర్చించటం, పరిష్కారాలపై మాట్లాడటం అన్నది ప్రతిపక్షంలో ఉన్నపుడే సాధ్యమవుతుంది. పొరబాటున అధికారంలోకి వచ్చేస్తే ఈపనులన్నీ సాధ్యంకాదు. ఈ విషయాన్ని రాహుల్ కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఎలాగుంటుందన్నది ఎన్నికల ఫలితాలు వస్తేకానీ తెలీదు. ఈలోపు జనాల మనిషి అనిపించుకోవటమే రాహుల్ కు చాలా ముఖ్యం.

This post was last modified on October 4, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

1 hour ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

6 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

6 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

7 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

9 hours ago