నిజామాబాద్ పర్యటనలో నరేంద్రమోడీ చాలా మాటలే చెప్పారు. ముఖ్యంగా కేసీయార్ ను కార్నర్ చేయటానికి కొన్ని విషయాలు ప్రస్తావించారు. అందులో తనకు కేసీయార్ కు మధ్య ఎప్పుడో జరిగిన సంభాషణలను ఇపుడు బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీయార్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. మొదటిదేమో ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ అడిగితే మోడీ కుదరదు పొమ్మన్నారట.
అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు కావాలని తనను అడిగితే ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారట. అవినీతి పార్టీలతో తాము పొత్తు పెట్టుకునేది లేదని కచ్చితంగా చెప్పేసినట్లు మోడీ చెప్పారు. ఫైనల్ పాయింట్ ఏమిటంటే ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని కొడుకు కేటీఆర్ కు సీఎం పదవిని ఇస్తానంటే ఇదేమైనా రాజరికమా రాజు తర్వాత యువరాజుకు పట్టం కట్టడానికి అని తాను నిలదీసినట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని అంటే మోడీ వద్దనే అవకాశాలు దాదాపు లేదు. ఎందుకంటే మైనస్ బీజేపీ ఎన్డీయే జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. లోక్ సభలో ఎన్డీయేకి 334 సీట్లుంటే ఇందులో 305 సీట్లు బీజేపీదే. ఒక్కసీటు కూడా లేని పార్టీలు ఎన్డీయేలో చాలా ఉన్నాయి. అలాంటిది తొమ్మిది సీట్లున్న బీఆర్ఎస్ ను మోడీ ఎందుకు వద్దనుకుంటారు ? ఇక అవినీతే పెద్ద సమస్య అయితే బీజేపీ మీదే చాలా రాష్ట్రాల్లో ఆరోపణలున్నాయి.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కు బీజేపీ మద్దతు ఏమి అవసరం. గ్రేటర్ లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీ మద్దతు అడుగుతారా ? చివరగా కేటీయార్ కు పట్టాభిషేకం చేయాలంటే మోడీకి ఎందుకు కేసీయార్ చెప్పాలి ? ఇది పూర్తిగా కేసీయార్ ఇష్టం. కేటీయార్ ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటే అందుకు మోడీ అనుమతి అవసరమే లేదని అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా లేవు.
This post was last modified on October 4, 2023 12:00 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…