నిజామాబాద్ పర్యటనలో నరేంద్రమోడీ చాలా మాటలే చెప్పారు. ముఖ్యంగా కేసీయార్ ను కార్నర్ చేయటానికి కొన్ని విషయాలు ప్రస్తావించారు. అందులో తనకు కేసీయార్ కు మధ్య ఎప్పుడో జరిగిన సంభాషణలను ఇపుడు బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీయార్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. మొదటిదేమో ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ అడిగితే మోడీ కుదరదు పొమ్మన్నారట.
అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు కావాలని తనను అడిగితే ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారట. అవినీతి పార్టీలతో తాము పొత్తు పెట్టుకునేది లేదని కచ్చితంగా చెప్పేసినట్లు మోడీ చెప్పారు. ఫైనల్ పాయింట్ ఏమిటంటే ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని కొడుకు కేటీఆర్ కు సీఎం పదవిని ఇస్తానంటే ఇదేమైనా రాజరికమా రాజు తర్వాత యువరాజుకు పట్టం కట్టడానికి అని తాను నిలదీసినట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని అంటే మోడీ వద్దనే అవకాశాలు దాదాపు లేదు. ఎందుకంటే మైనస్ బీజేపీ ఎన్డీయే జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. లోక్ సభలో ఎన్డీయేకి 334 సీట్లుంటే ఇందులో 305 సీట్లు బీజేపీదే. ఒక్కసీటు కూడా లేని పార్టీలు ఎన్డీయేలో చాలా ఉన్నాయి. అలాంటిది తొమ్మిది సీట్లున్న బీఆర్ఎస్ ను మోడీ ఎందుకు వద్దనుకుంటారు ? ఇక అవినీతే పెద్ద సమస్య అయితే బీజేపీ మీదే చాలా రాష్ట్రాల్లో ఆరోపణలున్నాయి.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కు బీజేపీ మద్దతు ఏమి అవసరం. గ్రేటర్ లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీ మద్దతు అడుగుతారా ? చివరగా కేటీయార్ కు పట్టాభిషేకం చేయాలంటే మోడీకి ఎందుకు కేసీయార్ చెప్పాలి ? ఇది పూర్తిగా కేసీయార్ ఇష్టం. కేటీయార్ ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటే అందుకు మోడీ అనుమతి అవసరమే లేదని అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా లేవు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…