Political News

కేసుల సంఖ్యలో ఆ 19 రాష్ట్రాలను బీట్ చేసిన తూ.గో జిల్లా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపు 6-8 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 8,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా….మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. గత 24 గంటల్లో 86 మంది మరణించగా…కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మరణించారు.

ఇక, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో 1441 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 50,686కు చేరుకుంది. ఈ ఒక్క జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా…కరోనా బారిన పడి 335 మంది మరణించడంతో ఆ జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.

అయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 50 వేలకు లోపే ఉన్నప్పటికీ…ఏపీలోని ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి-డమన్ అండ్ డయ్యూ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటలేదు. వీటిలో చాలా రాష్ట్రాలలో కేసుల సంఖ్య 10వేలకు లోపే ఉండడం విశేషం.

అయితే, తూ.గో జిల్లాలో కరోనా కేసుల తీవ్రతకు ప్రజల నిర్లక్ష్యం కారణమా…లేక ప్రభుత్వ వైఫల్యమా అన్నదానిపై చర్చ జరుగుతోంది. తూ.గో జిల్లాతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య 30వేలకు పైగా నమోదు కావడం కూడా కలవరపెడుతోంది.

రాష్ట్రాలనే కాదు, అనేక దేశాలను తూగో జిల్లా దాటేసింది… మనందరికీ బాగా తెలిసిన ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, అల్జీరియా, యెమెన్, మలేషియా వంటి అనేక ప్రముఖ దేశాలతో పాటు వంద దేశాల కంటే కూడా తూర్పుగోదావరి జిల్లా కరోనా కేసుల్లో ముందంజలో ఉంది.

This post was last modified on August 25, 2020 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

46 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago