జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగులు, బధిరులను చూసి పవన్ కంటతడి పెట్టారు. జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు.
కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ వెన్నుపూసకు గాయం కాగా…తరచుగా వెన్ను నొప్పి వస్తోందని పవన్ గతంలో చెప్పారు. రేపు పెడన సభ నేపథ్యంలో పవన్ అస్వస్థతకు గురికావడంతో పవన్ అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పవన్ కు నొప్పి తగ్గకుంటే పెడన సభ క్యాన్సిల్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు.
అంతకుముందు, జగన్ పై పవన్ విరుచుకుపడ్డారు. క్లాస్ వార్ అని ఇంకోసారి మాట్లాడకు జగన్… రాయలసీమ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రజలు తమ సమస్యలు తనతో చెప్పుకుంటున్నారు అని మండిపడ్డారు. అణగారిన వర్గానికి నాయకుడిగా చెప్పుకునే పెద్ద మనిషి జగన్ పేదల ఇళ్లను దౌర్జన్యంగా ఖాళీ చేయించి వీధికి లాగాడని విమర్శించారు. వైఎస్ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. పేపర్లపై పట్టాలు చూపించి..ఇళ్లను తొలగించడం దుర్మార్గం అని, న్యాయం చేసే వరకు క్లాస్ వార్ అని చెప్పకు అంటూ హెచ్చరించారు.
This post was last modified on October 3, 2023 8:55 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…