జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగులు, బధిరులను చూసి పవన్ కంటతడి పెట్టారు. జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు.
కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ వెన్నుపూసకు గాయం కాగా…తరచుగా వెన్ను నొప్పి వస్తోందని పవన్ గతంలో చెప్పారు. రేపు పెడన సభ నేపథ్యంలో పవన్ అస్వస్థతకు గురికావడంతో పవన్ అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పవన్ కు నొప్పి తగ్గకుంటే పెడన సభ క్యాన్సిల్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు.
అంతకుముందు, జగన్ పై పవన్ విరుచుకుపడ్డారు. క్లాస్ వార్ అని ఇంకోసారి మాట్లాడకు జగన్… రాయలసీమ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రజలు తమ సమస్యలు తనతో చెప్పుకుంటున్నారు అని మండిపడ్డారు. అణగారిన వర్గానికి నాయకుడిగా చెప్పుకునే పెద్ద మనిషి జగన్ పేదల ఇళ్లను దౌర్జన్యంగా ఖాళీ చేయించి వీధికి లాగాడని విమర్శించారు. వైఎస్ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. పేపర్లపై పట్టాలు చూపించి..ఇళ్లను తొలగించడం దుర్మార్గం అని, న్యాయం చేసే వరకు క్లాస్ వార్ అని చెప్పకు అంటూ హెచ్చరించారు.
This post was last modified on October 3, 2023 8:55 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…