స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ కేసును ఈ రోజు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు కూడా చంద్రబాబుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఆ పిటిషన్ విచారణను సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును రోహత్గీ కోరారు. తాము అన్ని వివరాలతో రెడీగా ఉన్నామని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందించారు. లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీలు చంద్రబాబు తరఫు వాదనలు వినిపించారు. బెయిల్ కోసం అప్పీలు చేయకుండా క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని రోహత్గీ వాదించారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ స్కాం అంతకుముందే జరిగిందని వివరించారు.
సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే కాదని, అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిందని వాదించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తుపై జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచేలా కక్ష సాధింపు కనిపిస్తోందని లూథ్రా తెలిపారు.
This post was last modified on October 3, 2023 2:57 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…