Political News

వైసీపీలో నలుగురు ఖాయమయ్యారు

అధికారం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీరియస్ దృష్టిపెట్టాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకపుడు రాష్ట్రంలో పర్యటించటంతో పాటు నియోజకవర్గాల సమీక్షలు చేస్తు కొందరు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. గడచిన 24 రోజులుగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో వైసీపీలో క్యాండిడేట్లను ఫైనల్ చేసే ప్రక్రియ మొదలైంది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు.

ఎంపీ మొదటి తన పర్యటనను తిరుపతి జిల్లాతో మొదలుపెట్టారు. రెండురోజుల పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటి ? ఎంఎల్ఏల పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని కూడా ఆరాతీశారు. ఈ రెండురోజుల సమావేశాల్లో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేశారు. అవేమిటంటే తిరుపతి నుండి భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి నుండి బియ్యపు మధుసూధనరెడ్డి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నుండి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ ఖాయమైపోయింది.

తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీచేయటంలేదని గతంలోనే ప్రకటించేశారు. అందుకనే ఇపుడు అభినయ్ అనధికారిక ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారు. ఇక చంద్రగిరిలో కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బదులు కొడుకు మోహిత్ పోటీ చేస్తారని ఎంపి ప్రకటించారు. ఇప్పటికే మోహిత్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇక శ్రీకాళహస్తిలో ఎంఎల్ఏ బియ్యపే మళ్ళీ పోటీచేయబోతున్నారు. వెంకటగిరిలో నేదురుమల్లి పోటీచేయటం ఖాయమైపోయింది. వీళ్ళనలుగురి గెలుపుకు నేతలు, క్యాడర్ అంతా కష్టపడాలని విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. మిగిలిన గూడూరు, సత్యవేడు, సూళ్ళూరుపేట ఎంఎల్ఏలు వరప్రసాద్, కలివేటి సంజీవయ్య, కోనేటి ఆదిమూలంపై బాగా ఆరోపణలొచ్చాయి. సిట్టింగులకు మళ్ళీ టికెట్లిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని నేతలు, క్యాడర్ స్పష్టంగా చెప్పేశారట. అంటే వీళ్ళ ముగ్గురి వైఖరిపై బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. అందుకనే ఈ మూడింటిపైన జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఎంపీ ప్రకటించారు.

This post was last modified on October 3, 2023 11:23 am

Share
Show comments

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

1 hour ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

6 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

6 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

7 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

9 hours ago