Political News

మైనంపల్లి రాక.. మెదక్ కాంగ్రెస్ లో కుంపటి

బీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించి భంగపడ్డ మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్ కు మెదక్ టికెట్లు ఇస్తామనే హామీతో మైనంపల్లి హస్తం గూటికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మెదక్ లో కాంగ్రెస్ లో ఇదే ఇప్పుడు కుంపటి రాజేసిందనే చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. అంతే కాకుండా సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు కలిగిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్ మోడల్ గా మారిందనే భావన ప్రజల్లోకి వెళ్తుందని తిరుపతి రెడ్డి వ్యాఖ్యానించారు.

మెదక్లో కాంగ్రెస్ పార్టీ కోసం కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పదేళ్లుగా కష్టపడుతున్నారు. ఆయన రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కొడుకు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

పార్టీ కోసం పని చేసిన వాళ్లకు గుర్తింపు దక్కడం లేదనే వేదనతో తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ లో స్థానం లేదనే విషయం ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు ఇప్పుడు పిలిచి మరీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం డబ్బు సంచులు ఉన్నవాళ్లకే సీట్లు దక్కుతాయనే విషయం తేటతెల్లమైందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల కోసం సీట్లు త్యాగం చేసే విషయంలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఇలాగే అసంత్రుప్తితో ఉన్నారని సమాచారం.

This post was last modified on October 2, 2023 8:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

12 minutes ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

51 minutes ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

2 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

3 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

4 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

4 hours ago