Political News

ప‌వ‌న్ వారాహి యాత్రః ప్రభుత్వం పై పవన్ దండయాత్ర

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు క్రిష్ణా జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఏం మాట్లాడుతాడు అన్నదానిపై ఆసక్తి నెలకొని ఉంది.

ఊహించినట్లే కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్ర‌సంగం సంచలనంగా ఉంద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈరోజు పవన్ మాట్లాడుతూ సెప్టెంబరులో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పేరుతో ప్రభుత్వం సర్వే చేయించ‌గా అందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, బాధాక‌ర‌మైన విష‌యాలు వ‌చ్చాయి. వేరే రాష్ట్రాలకు 3.17 లక్షలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయని ఈ సర్వేలో తేలింది. 3 లక్షలకు పైగా పిల్లలు డ్రాపవుట్స్ అయ్యారు. 62,754 మందికి పైగా బడి ఈడు పిల్లలు చనిపోయారు అని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త‌ద్వారా ఇటు ప్ర‌స్తుత త‌ర‌మే కాకుండా భ‌విష్య‌త్ త‌రం ఎలా ఇబ్బందుల పాలు అవుతుందో ప‌వ‌న్ గ‌ణాంకాల‌తో వివ‌రించారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు.

లక్షలాది కోట్లు ఉన్నవాడితో, ప్రైవేట్ సైన్యం ఉన్న వాడితో, అనుభవజ్ఞులైన వారిని కూడా కటకటాల్లోకి పంపించిన వ్యక్తితో మీకోసం నేను తలపడుతున్నాను అంటే నా నైతిక బలం ఎంత అనేది అర్దం చేసుకోండి అంటూ త‌న నిబ‌ద్ద‌త‌ను, త‌న పోరాటాన్ని పవ‌న్ వ్య‌క్తీక‌రించాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను అంటూ త‌న‌కు రాజ‌కీయ ప‌రిణ‌తి లేద‌నే వారికి క్లారిటీ ఇచ్చారు. 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్‌లో ప‌రిణ‌తి క‌నిపిస్తోంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

This post was last modified on October 1, 2023 11:26 pm

Share

Recent Posts

డ్రాగన్ అనుకున్న టైంకి రాగలదా

ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…

32 minutes ago

బండ్ల గణేష్ నెట్‌వర్క్… సోషల్ మీడియా చర్చ

నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…

49 minutes ago

వెంకీ అట్లూరి… గేమ్ ప్లాన్ మారాలి

విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…

2 hours ago

తెలుగు ప్రేక్షకులే కాదు… తెలుగు హీరోలు కూడా…

లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…

2 hours ago

రీమేకులని చెడగొట్టడంలో వీళ్ళ రూటే వేరు

ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…

2 hours ago

కొరటాలకే ఎందుకిలా జరుగుతోంది

దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…

2 hours ago