Political News

ప‌వ‌న్ వారాహి యాత్రః ప్రభుత్వం పై పవన్ దండయాత్ర

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు క్రిష్ణా జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఏం మాట్లాడుతాడు అన్నదానిపై ఆసక్తి నెలకొని ఉంది.

ఊహించినట్లే కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్ర‌సంగం సంచలనంగా ఉంద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈరోజు పవన్ మాట్లాడుతూ సెప్టెంబరులో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పేరుతో ప్రభుత్వం సర్వే చేయించ‌గా అందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, బాధాక‌ర‌మైన విష‌యాలు వ‌చ్చాయి. వేరే రాష్ట్రాలకు 3.17 లక్షలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయని ఈ సర్వేలో తేలింది. 3 లక్షలకు పైగా పిల్లలు డ్రాపవుట్స్ అయ్యారు. 62,754 మందికి పైగా బడి ఈడు పిల్లలు చనిపోయారు అని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త‌ద్వారా ఇటు ప్ర‌స్తుత త‌ర‌మే కాకుండా భ‌విష్య‌త్ త‌రం ఎలా ఇబ్బందుల పాలు అవుతుందో ప‌వ‌న్ గ‌ణాంకాల‌తో వివ‌రించారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు.

లక్షలాది కోట్లు ఉన్నవాడితో, ప్రైవేట్ సైన్యం ఉన్న వాడితో, అనుభవజ్ఞులైన వారిని కూడా కటకటాల్లోకి పంపించిన వ్యక్తితో మీకోసం నేను తలపడుతున్నాను అంటే నా నైతిక బలం ఎంత అనేది అర్దం చేసుకోండి అంటూ త‌న నిబ‌ద్ద‌త‌ను, త‌న పోరాటాన్ని పవ‌న్ వ్య‌క్తీక‌రించాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను అంటూ త‌న‌కు రాజ‌కీయ ప‌రిణ‌తి లేద‌నే వారికి క్లారిటీ ఇచ్చారు. 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్‌లో ప‌రిణ‌తి క‌నిపిస్తోంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

This post was last modified on October 1, 2023 11:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్రహ్మాజీ కష్టానికి దక్కని ఫలితం

బ్రహ్మాజీ అంతా తానై ప్రమోషన్లు చేసుకున్న బాపూ మొన్న శుక్రవారం విడుదలై కనీస స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక ఎదురీదుతోంది. బలగం…

10 minutes ago

ఫ్లాప్ హీరోయిన్ ఫేవరెట్ అయిపోయింది

దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి. అది ఉండబట్టే…

58 minutes ago

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన…

1 hour ago

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు…

2 hours ago

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే…

2 hours ago

టాలీవుడ్ సినిమాలతో అనిరుధ్ బిజీ బిజీ

నిన్నటి దాకా దొరకడమే మహా కష్టం, ఏదైనా వర్క్ చేయించుకోవడం అంత కన్నా సవాల్ అనే రీతిలో ఉన్న అనిరుధ్…

3 hours ago