టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి నారా భువనేశ్వరితోపాటు కోడలు నారా బ్రాహ్మణి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన పలు నిరసన కార్యక్రమాలలో అత్తాకోడళ్లు చురుగ్గా పాల్గొని ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి అక్టోబరు 2న నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అక్టోబరు 2వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాలపాటు ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆపేసి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని అచ్చెన్న పిలుపునిచ్చారు.
నంద్యాలల జరిగిన పార్టీ మీటింగ్ లో అచ్చెన్న పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 97 మంది చనిపోయినట్లు తెలిసిందని, వారికి సంతాపం తెలిపామని అచ్చెన్న అన్నారు. త్వరలోనే టీడీపీ, జనసేన జేఏసీ రూపుదిద్దుకుంటుందని, ఆ తర్వాత పోరాటం ఉద్ధృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఆ జేఏసీ ఉంటుందని, ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమంలో జనసేనతో సమన్వయం చేసుకొని టీడీపీ ముందుకు పోతుందని అన్నారు.
మరోవైపు, ఈ రోజు టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసేన మద్దతు తెలిపింది. ఆ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. వారాహి యాత్రకు మద్దతు తెలిపిన టీడీపీకి ధన్యవాదాలు చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బహిరంగ సభతో మొదలయ్యే వారాహి యాత్ర అక్టోబర్ 1 నుంచి 5 రోజుల పాటు ఖరారైందని తెలిపారు.
This post was last modified on September 30, 2023 11:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…