ఏపీ సీఐడీ పోలీసులు.. టీడీపీ యువనాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఐడీ పోలీసులు నారా లోకేష్ కోసం వెతికిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీశారు. అయితే, నారా లోకేష్ ఎక్కడ ఉన్నారనేది టీడీపీ బయటపెట్టలేదు.
ఈ క్రమంలో అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్నట్టుగా తెలుసుకున్న సీఐడీ పోలీసులు.. ఆ కార్యాలయంలోకి వెళ్లి లోకేష్ కి 41 ఏ నోటిసులు అందించారు. దీనికి ముందు వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర హైకోర్టుకు కూడా సీఐడీ అధికారులు సమాచారం అందించారు.
నారా లోకేష్ ఉనికి తమకు తెలియనందున ఆయన ఫోన్ వాట్సాప్కు నోటీసులను పంపించామని పేర్కొన్నారు. అయితే, తర్వాత గల్లా కార్యాలయంలో నారా లోకేష్ ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు చేరుకుని నోటీసులు అందించారు. ఇక, నారా లోకేష్ కూడా తనకు అందిన నోటీసులపై స్పందించారు. నోటిసులు అందుకున్నానని పేర్కొన్నారు. సిఐడి అధికారుల నుంచి స్వయంగా నోటీసులు అందుకున్నారు.
అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ రోజు తప్పకుండా విచారణకు వచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన రిప్లయి సమాధానంలో తెలిపారు.
This post was last modified on September 30, 2023 7:18 pm
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…