ఏపీ సీఐడీ పోలీసులు.. టీడీపీ యువనాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఐడీ పోలీసులు నారా లోకేష్ కోసం వెతికిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీశారు. అయితే, నారా లోకేష్ ఎక్కడ ఉన్నారనేది టీడీపీ బయటపెట్టలేదు.
ఈ క్రమంలో అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్నట్టుగా తెలుసుకున్న సీఐడీ పోలీసులు.. ఆ కార్యాలయంలోకి వెళ్లి లోకేష్ కి 41 ఏ నోటిసులు అందించారు. దీనికి ముందు వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర హైకోర్టుకు కూడా సీఐడీ అధికారులు సమాచారం అందించారు.
నారా లోకేష్ ఉనికి తమకు తెలియనందున ఆయన ఫోన్ వాట్సాప్కు నోటీసులను పంపించామని పేర్కొన్నారు. అయితే, తర్వాత గల్లా కార్యాలయంలో నారా లోకేష్ ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు చేరుకుని నోటీసులు అందించారు. ఇక, నారా లోకేష్ కూడా తనకు అందిన నోటీసులపై స్పందించారు. నోటిసులు అందుకున్నానని పేర్కొన్నారు. సిఐడి అధికారుల నుంచి స్వయంగా నోటీసులు అందుకున్నారు.
అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ రోజు తప్పకుండా విచారణకు వచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన రిప్లయి సమాధానంలో తెలిపారు.
This post was last modified on September 30, 2023 7:18 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…