ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. రిమాండ్ మీద బాబు జైల్లో ఉండటం.. లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం.. టీడీపీతో పొత్తును జనసేన అధినేత పవన్ ప్రకటించడం.. ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడీ పొలిటికల్ హీట్ ను మరింత పెంచేందుకు జనసేనాని పవన్ బరిలో దిగుతున్నారు. ఆదివారం (అక్టోబర్ 1) నుంచి నాలుగో విడత జనసేన వారాహి విజయ యాత్రను ప్రారంభించనున్నారు.
ఇప్పటికే మూడు విడతలుగా సాగిన వారాహి విజయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు నాలుగో విడత యాత్రను ఉమ్మడి క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్ ప్రారంభించనున్నారు. ఈ నాలుగో విడత యాత్రలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయాన్నే ఆయుధంగా మలుచుకుని సీఎం జగన్ పై పవన్ మాటలతో రెచ్చిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు అరెస్టు విషయం తెలియగానే విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించిన పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డు మీద పడుకుని హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జైల్లో రిమాండ్ మీద ఉన్న బాబును కలిసిన తర్వాత పవన్ పొత్తు విషయం ప్రకటించారు.
ఇప్పుడిక వారాహి విజయ యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్.. బాబు అరెస్టు అక్రమమని నినదిస్తూ, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడే ఆస్కారముంది. రాజకీయ కక్షతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారని, తాము కూడా యుద్ధానికి సిద్ధమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగో విడత వారాహి విజయ యాత్రలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమతో పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా పవన్ ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…