అసలే ఎన్నికల సమయం కావడం… సెటిలర్ల ఓట్లు, అదేసమయంలో టీడీపీ అభిమానుల ఓట్లు కూడా కలవర పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, పొలిటికల్ హాట్ కామెంట్లు పేల్చే యువ నాయకుడు కేటీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. “మాకు రాముడైనా.. కృష్ణుడైనా సీనియర్ ఎన్టీఆర్ ఒక్కరే!!” అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అంతేకాదు.. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. వారందరి ఆరాధ్య దైవం ఎన్టీఆరేనని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్పై రూ.1.37 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు.
“విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు… ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు. అప్పటి శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది కూడా ఎన్టీఆరేనని చెప్పారు.
చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందన్న కేటీఆర్ .. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు.. ఎన్నికల నేపథ్యంలో అటు సెటిలర్లు, ఇటు టీడీపీ అభిమానులను ఆకర్షించేవిగా ఉన్నాయనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 30, 2023 3:15 pm
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…