Political News

తిరుపతి అభ్యర్ధిని ఫైనల్ చేశారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ తిరుపతి ఎంఎల్ఏ అభ్యర్ధిని ఫైనల్ చేసినట్లే ఉంది. భూమన అభినయరెడ్డి పోటీ చేయబోతున్నట్లు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో తిరుపతి ఎంఎల్ఏగా అభినయరెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు. ఎంపీ తాజా ప్రకటనతో అభ్యర్ధి విషయంలో ఇంతకాలం జరిగిన ప్రచారానికి తెరపడినట్లయ్యింది.

ప్రస్తుతం తిరుపతి ఎంఎల్ఏగా భూమన కరుణాకరరెడ్డి ఉన్నారు. ఈయన్నే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు ఛైర్మన్ గా కూడా నియమించారు. 2019 లో గెలిచినపుడే కరుణాకరరెడ్డి అవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుకు అభినయ్ ని డిప్యుటి మేయర్ గా చేయించకుకున్నారు. అప్పటి నుండి అభినయే అనధికారిక ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారు.

తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా డాక్టర్ శిరీష ఉన్నప్పటికీ తండ్రి, కొడుకులు ఆమెను డమ్మీని చేసేశారు. అంటే డిప్యూటీ మేయర్ అభినయే అటు ఎంఎల్ఏగా ఇటు మేయర్ గా అనధికారిక అధికారాలను చెలాయిస్తున్నారు. తిరుపతిలో జరిగే ఏ కార్యక్రమం అయినా అభినయ్ లేకుండా జరగటంలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తిరుపతిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినయే పర్యవేక్షిస్తున్నారు. పార్టీతో పాటు అధికార యంత్రాంగం మొత్తం అభినయ్ చుట్టే తిరుగుతోంది.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తిరుపతి నుండి బీసీ అభ్యర్థిని ఎంఎల్ఏగా పోటీచేయించాలని జగన్ అనుకున్నారనే ప్రచారం పెరిగిపోయింది. మేయర్ శిరీష్ ఎలాగూ బీసీనే కాబట్టి అందులోను ఆమె డాక్టర్ కూడా కావటంతో ఆమే కాబోయే ఎంఎల్ఏ అభ్యర్ధనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎంఎల్ఏ అభ్యర్ధి విషయంలో క్లారిటి ఇవ్వాలని జగన్ను అడిగినట్లున్నారు. తన కొడుక్కే టికెట్ కావాలని పట్టుబట్టినట్లున్నారు. చివరకు ఏమనుకున్నారో ఏమో అభినయ్ నే పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి తిరుపతిలోనే ప్రకటించి సస్పెన్సుకు తెరదించారు.

This post was last modified on September 30, 2023 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago