Political News

తిరుపతి అభ్యర్ధిని ఫైనల్ చేశారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ తిరుపతి ఎంఎల్ఏ అభ్యర్ధిని ఫైనల్ చేసినట్లే ఉంది. భూమన అభినయరెడ్డి పోటీ చేయబోతున్నట్లు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో తిరుపతి ఎంఎల్ఏగా అభినయరెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు. ఎంపీ తాజా ప్రకటనతో అభ్యర్ధి విషయంలో ఇంతకాలం జరిగిన ప్రచారానికి తెరపడినట్లయ్యింది.

ప్రస్తుతం తిరుపతి ఎంఎల్ఏగా భూమన కరుణాకరరెడ్డి ఉన్నారు. ఈయన్నే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు ఛైర్మన్ గా కూడా నియమించారు. 2019 లో గెలిచినపుడే కరుణాకరరెడ్డి అవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుకు అభినయ్ ని డిప్యుటి మేయర్ గా చేయించకుకున్నారు. అప్పటి నుండి అభినయే అనధికారిక ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారు.

తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా డాక్టర్ శిరీష ఉన్నప్పటికీ తండ్రి, కొడుకులు ఆమెను డమ్మీని చేసేశారు. అంటే డిప్యూటీ మేయర్ అభినయే అటు ఎంఎల్ఏగా ఇటు మేయర్ గా అనధికారిక అధికారాలను చెలాయిస్తున్నారు. తిరుపతిలో జరిగే ఏ కార్యక్రమం అయినా అభినయ్ లేకుండా జరగటంలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తిరుపతిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినయే పర్యవేక్షిస్తున్నారు. పార్టీతో పాటు అధికార యంత్రాంగం మొత్తం అభినయ్ చుట్టే తిరుగుతోంది.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తిరుపతి నుండి బీసీ అభ్యర్థిని ఎంఎల్ఏగా పోటీచేయించాలని జగన్ అనుకున్నారనే ప్రచారం పెరిగిపోయింది. మేయర్ శిరీష్ ఎలాగూ బీసీనే కాబట్టి అందులోను ఆమె డాక్టర్ కూడా కావటంతో ఆమే కాబోయే ఎంఎల్ఏ అభ్యర్ధనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎంఎల్ఏ అభ్యర్ధి విషయంలో క్లారిటి ఇవ్వాలని జగన్ను అడిగినట్లున్నారు. తన కొడుక్కే టికెట్ కావాలని పట్టుబట్టినట్లున్నారు. చివరకు ఏమనుకున్నారో ఏమో అభినయ్ నే పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి తిరుపతిలోనే ప్రకటించి సస్పెన్సుకు తెరదించారు.

This post was last modified on September 30, 2023 10:48 am

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

1 hour ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

2 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

6 hours ago