టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి నేరుగా కదనరంగంలోకి దిగిపో యారు. నారా చంద్రబాబు అరెస్టు, జైలును నిరసిస్తూ.. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆమె ప్రత్య క్షంగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపై సమర శంఖం కూడా పూరించారు. ఇక, ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణను మరింత ముమ్మరం చేస్తూ.. ప్రజలకు ఉద్యమ పిలుపునిచ్చారు.
“మోత మోగిద్దాం రండి!” పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా… వైసీపీ ప్రభుత్వానికి వినిపించేలా సెప్టెంబర్ 30(శనివారం), రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు ఆమె పిలుపు నిచ్చారు. పళ్లాలపై గరిటలతో కానీ, డప్పులు మోగిస్తూ కానీ.. తమ నిరసనను తెలియజేయ వచ్చని బ్రాహ్మణి సూచించారు.
అంతేకాదు, ప్రజలు తెలియపరిచే నిరసన కార్యక్రమానికి సంబంధించి.. సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా బ్రాహ్మణి సూచించారు. “నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలి. ఇంట్లోనో, ఆఫీస్లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే 5 నిమిషాలపాటు హారన్ కొట్టండి” అని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.
This post was last modified on September 29, 2023 8:07 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…