టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి నేరుగా కదనరంగంలోకి దిగిపో యారు. నారా చంద్రబాబు అరెస్టు, జైలును నిరసిస్తూ.. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆమె ప్రత్య క్షంగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపై సమర శంఖం కూడా పూరించారు. ఇక, ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణను మరింత ముమ్మరం చేస్తూ.. ప్రజలకు ఉద్యమ పిలుపునిచ్చారు.
“మోత మోగిద్దాం రండి!” పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా… వైసీపీ ప్రభుత్వానికి వినిపించేలా సెప్టెంబర్ 30(శనివారం), రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు ఆమె పిలుపు నిచ్చారు. పళ్లాలపై గరిటలతో కానీ, డప్పులు మోగిస్తూ కానీ.. తమ నిరసనను తెలియజేయ వచ్చని బ్రాహ్మణి సూచించారు.
అంతేకాదు, ప్రజలు తెలియపరిచే నిరసన కార్యక్రమానికి సంబంధించి.. సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా బ్రాహ్మణి సూచించారు. “నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలి. ఇంట్లోనో, ఆఫీస్లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే 5 నిమిషాలపాటు హారన్ కొట్టండి” అని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.
This post was last modified on September 29, 2023 8:07 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…